TCS Nashik Case: ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవో ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. టీమ్ లీడర్లుగా ఉన్న ఆరుగురు ముస్లిం ఉద్యోగులు, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మరో నిందితురాలు నిదాఖాన్ కలిసి హిందూ మహిళా ఉద్యోగుల్ని వేధించిన కేసు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు, ఉద్యోగ భద్రత పేరుతో బెదిరింపులకు పాల్పడటం, మతమార్పిడి చర్యలకు నిందితులు పాల్పడ్డారు.