Tamil Nadu: కేంద్రం తీరుపై మళ్లీ సుప్రీంకోర్టుకు తమిళనాడు సర్కార్
- కేంద్రం తీరుపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం..
- రాష్ట్రానికి రావాల్సిన విద్యా నిధులను మోడీ సర్కార్ విడుదల చేయడం లేదని వెల్లడి..
- తమిళనాడుకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని స్టాలిన్ సర్కార్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: కేంద్రం- తమిళనాడు ప్రభుత్వాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతుంది. దీంతో మోడీ సర్కార్ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. రూ.2,291 కోట్లకు పైగా విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, PM SHRI పాఠశాలలు లాంటి సంబంధిత పథకాలను రాష్ట్రం అమలు చేసేలా చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఉపయోగిస్తోందని తమిళనాడు ఆరోపించింది.
Read Also: Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. రూ. 2,400 పెరిగిన తులం గోల్డ్ ధర
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
అయితే, రాష్ట్రానికి కేటాయించిన విద్యా నిధులను కేంద్రం నిలిపివేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులో నేరుగా కేసు వేసింది తమిళనాడు సర్కార్. ఆర్టికల్ 131 ప్రకారం, రాజ్యాంగ హక్కులకు సంబంధించిన వివాదాలలో కేంద్ర ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా సవాలు చేయడానికి రాష్ట్రానికి అనుమతి ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాల విద్యకు మద్దతు ఇచ్చే సమగ్ర శిక్ష పథకం (SSS) కింద రూ.2,291.30 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేయబడిన నిధులలో కేంద్రం 60 శాతం వాటాను మే 1వ తేదీ చెల్లింపు జరగలేదన్నారు.
Read Also: Vizag: ప్రపంచరికార్డు సృష్టించేలా అంతర్జాతీయ యోగా డే వేడుకలు.. విశాఖలో భారీ ఏర్పాట్లు
ఇక, సమగ్ర శిక్షా పథకం అనేది నాణ్యమైన విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ పథకం మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నట్లు అంగీకరిస్తూ.. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) ఫిబ్రవరి 16, 2024న తమిళనాడు సర్కార్ ప్రతిపాదనను ఆమోదించిందని చెప్పుకొచ్చింది. అయితే, మే 21, 2025 నాటికి కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అని తమిళనాడు తన పిటిషన్లో వెల్లడించింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!