Tamil Nadu: కేంద్రం తీరుపై మళ్లీ సుప్రీంకోర్టుకు తమిళనాడు సర్కార్
- కేంద్రం తీరుపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం..
- రాష్ట్రానికి రావాల్సిన విద్యా నిధులను మోడీ సర్కార్ విడుదల చేయడం లేదని వెల్లడి..
- తమిళనాడుకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని స్టాలిన్ సర్కార్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: కేంద్రం- తమిళనాడు ప్రభుత్వాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతుంది. దీంతో మోడీ సర్కార్ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. రూ.2,291 కోట్లకు పైగా విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, PM SHRI పాఠశాలలు లాంటి సంబంధిత పథకాలను రాష్ట్రం అమలు చేసేలా చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఉపయోగిస్తోందని తమిళనాడు ఆరోపించింది.
Read Also: Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. రూ. 2,400 పెరిగిన తులం గోల్డ్ ధర
Also Read
అయితే, రాష్ట్రానికి కేటాయించిన విద్యా నిధులను కేంద్రం నిలిపివేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులో నేరుగా కేసు వేసింది తమిళనాడు సర్కార్. ఆర్టికల్ 131 ప్రకారం, రాజ్యాంగ హక్కులకు సంబంధించిన వివాదాలలో కేంద్ర ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా సవాలు చేయడానికి రాష్ట్రానికి అనుమతి ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాల విద్యకు మద్దతు ఇచ్చే సమగ్ర శిక్ష పథకం (SSS) కింద రూ.2,291.30 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేయబడిన నిధులలో కేంద్రం 60 శాతం వాటాను మే 1వ తేదీ చెల్లింపు జరగలేదన్నారు.
Read Also: Vizag: ప్రపంచరికార్డు సృష్టించేలా అంతర్జాతీయ యోగా డే వేడుకలు.. విశాఖలో భారీ ఏర్పాట్లు
ఇక, సమగ్ర శిక్షా పథకం అనేది నాణ్యమైన విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ పథకం మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నట్లు అంగీకరిస్తూ.. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) ఫిబ్రవరి 16, 2024న తమిళనాడు సర్కార్ ప్రతిపాదనను ఆమోదించిందని చెప్పుకొచ్చింది. అయితే, మే 21, 2025 నాటికి కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అని తమిళనాడు తన పిటిషన్లో వెల్లడించింది.
తాజావార్తలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!