Tamil Nadu: తిరువళ్లువర్కి గవర్నర్ ‘‘కాషాయ’’ నివాళి.. తప్పుపట్టిన కాంగ్రెస్..
- తమిళకవి తిరువళ్లువర్కి గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళి..
- కాషాయ రంగుపై కాంగ్రెస్ అభ్యంతరం..
- గవర్నర్ని రీకాల్ చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళ కవి తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళులు అర్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బుధవారం చెన్నైలోని రాజ్ భవన్ ప్రాంగణంలో తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోలో తిరువళ్లువర్కి ‘‘కాషాయ’’ వస్త్రధారణ, రుద్రాక్ష పూసలు ఉండటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యతరం తెలిపింది. బూడిద, కుంకుమ వంటి మతపరమైన గుర్తులు ఉండటాన్ని తప్పుపట్టింది. ఇలాంటి చిత్రీకరణ ఆమోదయోగ్యం కాదని తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ కే. సెల్వపెరుంతగై అన్నారు.
Read Also: Israel-Hamas: కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ!
Also Read
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
ప్రభుత్వం గుర్తించిన తిరువళ్లువర్ చిత్రపటాన్ని గవర్నర్ పాటించలేదని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ఆయన సాధువు-కవి అలాంటి వ్యక్తికి మతపరమైన అర్థాలు ఇస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న గవర్నర్ ఇలా చేయడాన్ని ఖండిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వాన్నే కాకుండా, తమిళజాతిని, తిరువళ్లువర్ని కూడా అవమానించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
తమిళ మాసం థాయ్ రెండవ రోజున తిరువళ్లవర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.తమిళ సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన ‘‘తిరుక్కురల్’’ని రాసిన కవి తిరువళ్లువర్. నీతి, పాలన, వ్యక్తిగత ప్రవర్తనలకు ఈ గ్రంథం మార్గదర్శిగా ఉంది. సామాజిక విలువలు, పాలనను రూపొందించడంలో తిరువల్లువర్ ఎనలేని కృషి చేశారని గవర్నర్ రవి ప్రశంసించారు. తమిళ పోషకుడు తిరువళ్లువర్ని ఈ దేశం ప్రగాఢ కృతజ్ఞతతో, అత్యంత భక్తితో స్మరించుకుంటుందని, అనేక వేల సంవత్సరాల క్రితం ఆయన మనకు తిరుక్కురల్ అనే అసమానమైన జ్ఞానాన్ని ప్రసాదించారుని రాజ్ భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి ముందు ప్రధాని నరేంద్రమోడీ తమిళ కవికి నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!