Tamil Nadu: తిరువళ్లువర్కి గవర్నర్ ‘‘కాషాయ’’ నివాళి.. తప్పుపట్టిన కాంగ్రెస్..
- తమిళకవి తిరువళ్లువర్కి గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళి..
- కాషాయ రంగుపై కాంగ్రెస్ అభ్యంతరం..
- గవర్నర్ని రీకాల్ చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళ కవి తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళులు అర్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బుధవారం చెన్నైలోని రాజ్ భవన్ ప్రాంగణంలో తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోలో తిరువళ్లువర్కి ‘‘కాషాయ’’ వస్త్రధారణ, రుద్రాక్ష పూసలు ఉండటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యతరం తెలిపింది. బూడిద, కుంకుమ వంటి మతపరమైన గుర్తులు ఉండటాన్ని తప్పుపట్టింది. ఇలాంటి చిత్రీకరణ ఆమోదయోగ్యం కాదని తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ కే. సెల్వపెరుంతగై అన్నారు.
Read Also: Israel-Hamas: కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ!
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ప్రభుత్వం గుర్తించిన తిరువళ్లువర్ చిత్రపటాన్ని గవర్నర్ పాటించలేదని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ఆయన సాధువు-కవి అలాంటి వ్యక్తికి మతపరమైన అర్థాలు ఇస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న గవర్నర్ ఇలా చేయడాన్ని ఖండిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వాన్నే కాకుండా, తమిళజాతిని, తిరువళ్లువర్ని కూడా అవమానించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
తమిళ మాసం థాయ్ రెండవ రోజున తిరువళ్లవర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.తమిళ సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన ‘‘తిరుక్కురల్’’ని రాసిన కవి తిరువళ్లువర్. నీతి, పాలన, వ్యక్తిగత ప్రవర్తనలకు ఈ గ్రంథం మార్గదర్శిగా ఉంది. సామాజిక విలువలు, పాలనను రూపొందించడంలో తిరువల్లువర్ ఎనలేని కృషి చేశారని గవర్నర్ రవి ప్రశంసించారు. తమిళ పోషకుడు తిరువళ్లువర్ని ఈ దేశం ప్రగాఢ కృతజ్ఞతతో, అత్యంత భక్తితో స్మరించుకుంటుందని, అనేక వేల సంవత్సరాల క్రితం ఆయన మనకు తిరుక్కురల్ అనే అసమానమైన జ్ఞానాన్ని ప్రసాదించారుని రాజ్ భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి ముందు ప్రధాని నరేంద్రమోడీ తమిళ కవికి నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!