CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- రేపు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
- ప్రధాని మోడీతో సమావేశం
- కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీ తర్వాత వివిధ కేంద్రమంత్రులను కూడా కలవొచ్చని సమాచారం. ఇక మోడీతో సమావేశంలో పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కర్ణాటకతో ఉన్న మేకధాతు డ్యాం వివాదాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే ప్రధానికి సీఎం విజయ్ లేఖ రాశారు. కావేరి నదిపై మేకధాతు డ్యాం నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక మధ్య మేకధాతు డ్యాం. వివాదం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ఛాన్సుంది.
అలాగే శ్రీలంక జలాల సమీపంలో తమిళనాడు మత్స్యకారులపై జరుగుతున్న దాడులు, నిర్బంధాలు, కీలక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని విజయ్ కోరనున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను కలిసి.. భారత్-శ్రీలంకల మధ్య దీర్ఘకాలంగా దౌత్య, రాజకీయ సమస్యగా ఉన్న మత్స్యకారుల సమస్యను ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా రామనాథపురం, నాగపట్టణం వంటి తీరప్రాంత జిల్లాల మత్స్యకారులు తరచుగా పాల్క్ జలసంధి సమీపంలోని జలాల్లోకి వెళ్తుంటారు. అక్కడ సముద్ర సరిహద్దుల వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్టు చేయడం, నిర్బంధించడం, పడవలను స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్య తమిళనాడులో పదేపదే నిరసనలకు దారితీసింది. నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, శాశ్వత దౌత్య పరిష్కారం కనుగొనాలని వరుస రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్-శ్రీలంక చర్చలు జరిపినప్పటికీ, ఎప్పటికప్పుడు సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా విజయ్ లేవనెత్తనున్నారు.
Also Read
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి అధిక సహాయం కోరుతూ విజయ్ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలు, విపత్తు సహాయం, పారిశ్రామిక వృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి కేటాయింపులు పెంచాలని తమిళనాడు తరచుగా కోరుతూ వస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర పెద్దలతో విజయ్ కలవనున్న నేపథ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది.
తాజావార్తలు
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!