CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- రేపు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
- ప్రధాని మోడీతో సమావేశం
- కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీ తర్వాత వివిధ కేంద్రమంత్రులను కూడా కలవొచ్చని సమాచారం. ఇక మోడీతో సమావేశంలో పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కర్ణాటకతో ఉన్న మేకధాతు డ్యాం వివాదాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే ప్రధానికి సీఎం విజయ్ లేఖ రాశారు. కావేరి నదిపై మేకధాతు డ్యాం నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక మధ్య మేకధాతు డ్యాం. వివాదం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ఛాన్సుంది.
అలాగే శ్రీలంక జలాల సమీపంలో తమిళనాడు మత్స్యకారులపై జరుగుతున్న దాడులు, నిర్బంధాలు, కీలక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని విజయ్ కోరనున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను కలిసి.. భారత్-శ్రీలంకల మధ్య దీర్ఘకాలంగా దౌత్య, రాజకీయ సమస్యగా ఉన్న మత్స్యకారుల సమస్యను ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా రామనాథపురం, నాగపట్టణం వంటి తీరప్రాంత జిల్లాల మత్స్యకారులు తరచుగా పాల్క్ జలసంధి సమీపంలోని జలాల్లోకి వెళ్తుంటారు. అక్కడ సముద్ర సరిహద్దుల వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్టు చేయడం, నిర్బంధించడం, పడవలను స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్య తమిళనాడులో పదేపదే నిరసనలకు దారితీసింది. నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, శాశ్వత దౌత్య పరిష్కారం కనుగొనాలని వరుస రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్-శ్రీలంక చర్చలు జరిపినప్పటికీ, ఎప్పటికప్పుడు సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా విజయ్ లేవనెత్తనున్నారు.
Also Read
- Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
- Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
- Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్పై అన్నామలై ఫైర్
- Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి అధిక సహాయం కోరుతూ విజయ్ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలు, విపత్తు సహాయం, పారిశ్రామిక వృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి కేటాయింపులు పెంచాలని తమిళనాడు తరచుగా కోరుతూ వస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర పెద్దలతో విజయ్ కలవనున్న నేపథ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది.
తాజావార్తలు
-
CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
-
Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
-
Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా
-
Quad Meeting: పహల్గామ్ ఉగ్రదాడిని క్వాడ్ దేశాలు ఖండించాయి.. ఉగ్రవాదంపై కలిసి పోరాడతామన్న భారత్
-
Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్… ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!