CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- రేపు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
- ప్రధాని మోడీతో సమావేశం
- కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీ తర్వాత వివిధ కేంద్రమంత్రులను కూడా కలవొచ్చని సమాచారం. ఇక మోడీతో సమావేశంలో పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కర్ణాటకతో ఉన్న మేకధాతు డ్యాం వివాదాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే ప్రధానికి సీఎం విజయ్ లేఖ రాశారు. కావేరి నదిపై మేకధాతు డ్యాం నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక మధ్య మేకధాతు డ్యాం. వివాదం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ఛాన్సుంది.
అలాగే శ్రీలంక జలాల సమీపంలో తమిళనాడు మత్స్యకారులపై జరుగుతున్న దాడులు, నిర్బంధాలు, కీలక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని విజయ్ కోరనున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను కలిసి.. భారత్-శ్రీలంకల మధ్య దీర్ఘకాలంగా దౌత్య, రాజకీయ సమస్యగా ఉన్న మత్స్యకారుల సమస్యను ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా రామనాథపురం, నాగపట్టణం వంటి తీరప్రాంత జిల్లాల మత్స్యకారులు తరచుగా పాల్క్ జలసంధి సమీపంలోని జలాల్లోకి వెళ్తుంటారు. అక్కడ సముద్ర సరిహద్దుల వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్టు చేయడం, నిర్బంధించడం, పడవలను స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్య తమిళనాడులో పదేపదే నిరసనలకు దారితీసింది. నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, శాశ్వత దౌత్య పరిష్కారం కనుగొనాలని వరుస రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్-శ్రీలంక చర్చలు జరిపినప్పటికీ, ఎప్పటికప్పుడు సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా విజయ్ లేవనెత్తనున్నారు.
Also Read
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
- Insurance Murder Case : రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తని చంపింది.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు!
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి అధిక సహాయం కోరుతూ విజయ్ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలు, విపత్తు సహాయం, పారిశ్రామిక వృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి కేటాయింపులు పెంచాలని తమిళనాడు తరచుగా కోరుతూ వస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర పెద్దలతో విజయ్ కలవనున్న నేపథ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది.
తాజావార్తలు
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?