CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- రేపు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
- ప్రధాని మోడీతో సమావేశం
- కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం హస్తినకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీ తర్వాత వివిధ కేంద్రమంత్రులను కూడా కలవొచ్చని సమాచారం. ఇక మోడీతో సమావేశంలో పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కర్ణాటకతో ఉన్న మేకధాతు డ్యాం వివాదాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే ప్రధానికి సీఎం విజయ్ లేఖ రాశారు. కావేరి నదిపై మేకధాతు డ్యాం నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక మధ్య మేకధాతు డ్యాం. వివాదం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ఛాన్సుంది.
అలాగే శ్రీలంక జలాల సమీపంలో తమిళనాడు మత్స్యకారులపై జరుగుతున్న దాడులు, నిర్బంధాలు, కీలక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని విజయ్ కోరనున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను కలిసి.. భారత్-శ్రీలంకల మధ్య దీర్ఘకాలంగా దౌత్య, రాజకీయ సమస్యగా ఉన్న మత్స్యకారుల సమస్యను ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యంగా రామనాథపురం, నాగపట్టణం వంటి తీరప్రాంత జిల్లాల మత్స్యకారులు తరచుగా పాల్క్ జలసంధి సమీపంలోని జలాల్లోకి వెళ్తుంటారు. అక్కడ సముద్ర సరిహద్దుల వివాదాల కారణంగా గత కొన్నేళ్లుగా శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్టు చేయడం, నిర్బంధించడం, పడవలను స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్య తమిళనాడులో పదేపదే నిరసనలకు దారితీసింది. నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, శాశ్వత దౌత్య పరిష్కారం కనుగొనాలని వరుస రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్-శ్రీలంక చర్చలు జరిపినప్పటికీ, ఎప్పటికప్పుడు సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా విజయ్ లేవనెత్తనున్నారు.
Also Read
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Snake bite: కానిస్టేబుల్ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి అధిక సహాయం కోరుతూ విజయ్ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలు, విపత్తు సహాయం, పారిశ్రామిక వృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి కేటాయింపులు పెంచాలని తమిళనాడు తరచుగా కోరుతూ వస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర పెద్దలతో విజయ్ కలవనున్న నేపథ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది.
తాజావార్తలు
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?