Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- సీఎం విజయ్ కీలక నిర్ణయం
- ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- మారుమూల గ్రామాల్లో కూడా తిరగనున్న బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు ఎయిర్ కండీషన్డ్ (AC) బస్సులే ఉంటాయని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ వెల్లడించారు. ప్రజలు మరింత సౌకర్యవంతంగా.. ఎక్కువ దూరాలు ప్రయాణించేలా ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నదే సీఎం విజయ్ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఆదివారం సేలంలో అధికార పార్టీ టీవీకే (TVK) నిర్వహించిన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థిబన్.. తమిళనాడులోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సౌకర్యంగా ప్రయాణించేందుకు అవసరమైన అన్ని వసతులతో బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం భావిస్తున్నారని వివరించారు.
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఒక ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.. ఆ ప్రయాణం తర్వాత కొత్తగా కొనుగోలు చేసే ప్రతి ప్రభుత్వ బస్సులో ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం ఉండాలని సీఎం సూచించారని తెలిపారు. గత వారం ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బస్సు కండక్టర్తో మాట్లాడి ప్రయాణికులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రూ.127.21 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ 300 బస్సుల్లో 164 డీజిల్ బస్సులు, 136 BS-VI ప్రమాణాలకు అనుగుణమైన సీఎన్జీ బస్సులు ఉన్నాయి. వీటిని చెన్నైలోని కోయంబేడు, కిలాంబాక్కం వంటి ప్రధాన బస్ టెర్మినళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతూ ప్రయాణికుల రద్దీని తగ్గించడం, అనుసంధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా రవాణాను ఆధునీకరించడం, రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన అనుసంధానం కల్పించడం, ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!