Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- సీఎం విజయ్ కీలక నిర్ణయం
- ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- మారుమూల గ్రామాల్లో కూడా తిరగనున్న బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు ఎయిర్ కండీషన్డ్ (AC) బస్సులే ఉంటాయని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ వెల్లడించారు. ప్రజలు మరింత సౌకర్యవంతంగా.. ఎక్కువ దూరాలు ప్రయాణించేలా ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నదే సీఎం విజయ్ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఆదివారం సేలంలో అధికార పార్టీ టీవీకే (TVK) నిర్వహించిన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థిబన్.. తమిళనాడులోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సౌకర్యంగా ప్రయాణించేందుకు అవసరమైన అన్ని వసతులతో బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం భావిస్తున్నారని వివరించారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఒక ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.. ఆ ప్రయాణం తర్వాత కొత్తగా కొనుగోలు చేసే ప్రతి ప్రభుత్వ బస్సులో ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం ఉండాలని సీఎం సూచించారని తెలిపారు. గత వారం ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బస్సు కండక్టర్తో మాట్లాడి ప్రయాణికులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రూ.127.21 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ 300 బస్సుల్లో 164 డీజిల్ బస్సులు, 136 BS-VI ప్రమాణాలకు అనుగుణమైన సీఎన్జీ బస్సులు ఉన్నాయి. వీటిని చెన్నైలోని కోయంబేడు, కిలాంబాక్కం వంటి ప్రధాన బస్ టెర్మినళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతూ ప్రయాణికుల రద్దీని తగ్గించడం, అనుసంధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా రవాణాను ఆధునీకరించడం, రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన అనుసంధానం కల్పించడం, ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!