Tamil Nadu: సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం.. జాతీయ విద్యా విధానానికి స్వస్తి
- సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
- జాతీయ విద్యా విధానానికి స్వస్తి
- స్టేట్ పాలసీని ప్రకటించిన సీఎం స్టాలిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించారు. ద్విభాషా విధానానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర విద్యా విధానం (ఎస్ఈపీ)ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ విధానం కేంద్ర జాతీయ విద్యా విధానానికి నిర్ణయాత్మక విరామంలాంటిదని పేర్కొ్న్నారు. సైన్స్, ఏఐ, ఇంగ్లీష్లకు పెద్ద పీట వేశారు. ఇక 11, 12 తరగతుల మార్కుల ఆధారంగా యూజీ అడ్మిషన్లు ఉంటాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఈసీపై రాహుల్గాంధీ యుద్ధం.. బెంగళూరులో ధర్నా
Also Read
కొత్త విద్యా విధానాన్ని రూపొందించడానికి 2022లో రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ గత ఏడాది జూలైలో ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికను తాజాగా ముఖ్యమంత్రి విడుదల చేశారు. 3, 5, 8 తరగతులకు పబ్లిక్ పరీక్షలకు నిర్వహించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీని కారణంగా అధిక డ్రాపౌట్ రేట్లు పెరుగుతాయని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: UK-Israel: గాజాను స్వాధీనం చేసుకునే నిర్ణయం సరైంది కాదు.. బ్రిటన్ ప్రధాని అభ్యంతరం
తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడుతూ.. 10వ తరగతి వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డుతో సహా అన్ని బోర్డులలో విద్యార్థులు తమిళం చదువుతారన్నారు. జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా విధానానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కమిటీ ఎలాంటి కాపీ కొట్టలేదని పేర్కొన్నారు.
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్.. తమిళనాడు విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది రాష్ట్ర అహంకార విధానం అని అభివర్ణించారు. స్టేట్ పాలసీ జాతీయ విధానినికి కట్ అండ్ కాపీ అని విమర్శించారు. ఈ పద్ధతి విభజనాత్మకం అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను కుదించాలని కోరుకుంటోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
-
Bandi Bhageerath :బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!