K Annamalai: బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల ముందు ‘పెరియార్’ విగ్రహాలు తొలగిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Annamalai: బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల ముందు ఉన్న పెరియార్ విగ్రహాలను తొలగిస్తామని ప్రకటించారు. శ్రీరంగంలో జరిగిన ర్యాలీలో అన్నామలై ఈ ప్రకటన చేశారు. 1967లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల ముందు శిలాఫలకాలు ఏర్పాటు చేసి..‘‘ దేవుళ్లను అనుసరించే వారు మూర్ఖులు.. దేవున్ని నమ్మే వారు మోసగించబడుతారు. కాబట్టి దేవున్ని పూజించకండి’’ ప్రచారం చేశారని, అంతకుముందు ఈ బోర్డులు ఆలయాల ముందు లేవని అన్నారు.
‘‘ఈ రోజు శ్రీరంగం నేల నుంచి బీజేపీ మీకు హామీ ఇస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, మా మొదటి పని అటువంటి ధ్వజస్తంభాలను పెకిలించి, దీనికి బదులు మేము మా అళ్వార్లు, నాయనార్ల విగ్రహాలు ప్రతిష్టిస్తాము. తమిళ గురువు తిరువళ్లువర్ విగ్రహాన్ని ఉంచుతాము, మన స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను కూడా గౌరవిస్తాం’’ అని అన్నామలై అన్నారు.
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
Read Also: Laughing Gas: ‘లాఫింగ్ గ్యాస్’పై యూకే నిషేధం.. కారణమిదే..
అన్నామలై బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ మత, ధర్మదాయశాఖ మంత్రిత్వశాఖను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మంత్రిత్వ శాఖ చివరి రోజు బీజేపీ ప్రభుత్వ మొదటి రోజు అని ప్రకటించారు. పెరియార్ విగ్రహాలు, ఆయన చెప్పిన మాటలు తమిళనాడులోని పలు ఆలయాల ముందు ఉన్నాయి. శ్రీరంగంలోని ఆలయాల వెలుపల కూడా కనిపిస్తాయి.
అయితే ఈ బీజేపీ ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు ఇంకా స్పందించలేదు. ముఖ్యంగా డీఎంకే పెరియార్ సిద్ధాంతాలను ఫాలో అవుతోంది. పెరియార్ ని తమిళనాడులో ఆస్తిగా పరిగణిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అన్నామలై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!