Flag War : భారత్-పాక్ల మధ్య జెండా యుద్ధం.. దేశంలో అతి పెద్దదైన జెండా ఏర్పాటుకు సిద్ధం
Tallest flag in india on the Attari border: దేశంలో అత్యంత ఎత్తైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధం అవుతోంది. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ లోని అట్టారీ వద్ద 418 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రెండు దేశాల మధ్య జెండా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. అట్టారీ-వాఘా బార్డర్ వద్ద పాకిస్తాన్ వైపు భారత్ కన్నా పెద్దదైన పాకిస్తాన్ జెండాను ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా ఇండియా దాని కన్నా ఎతైన జాతీయ జెండాను ఏర్పాటు చేయబోతోంది.
Read Also: KCR Delhi Visit: బీఆర్ఎస్ చీఫ్గా తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. విషయం ఇదేనా..?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
భారత్ వైపు అట్టారీ బార్డర్ వద్ద 2017 మార్చిలో రూ.3.5 కోట్ల వ్యయంతో 360 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. అయితే దీని తర్వాత పాకిస్తాన్ అంతకన్నా ఎతైన జెండాను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ఈ ఏడాది ఆగస్టులో 400 అడుగుల పాకిస్తాన్ జెండాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దీని కన్నా ఎత్తు అంటే 418 అడుగుల జెండాను ఏర్పాటు చేయబోతోంది ఇండియా. ఇది పాకిస్తాన్ కన్నా 18 అడుగులు ఎక్కువ.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ ను నియమించిందని నేషనల్ హైవే అథారిటీ అధికారి వెల్లడించారు. జెండా మార్చే పని బహుశా 15-20 రోజుల్లో ప్రారంభం అవుతుందని.. జెండాను ఏర్పాటు చేసే ప్రదేశం ఇంకా నిర్ణయించ లేదని.. బీఎస్ఎఫ్ సూచన మేరకు జాయింట్ చెక్ పోస్టు ఆడియన్స్ గ్యాలరీకి దగ్గరలో ఉండే అవకాశం ఉందని.. గ్యాలరీ ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బీటింగ్ రిట్రీట్ చూసేందుకు వచ్చే ప్రజలకు జాతీయ జెండా సరిగ్గా కనిపించడం లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న జెండాను తొలగించే ప్రణాళిక లేదని.. అయితే కొత్త ప్లాగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని.. ఒక నెలలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెలగావి కోట వద్ద 361 అడుగుల అత్యంత ఎత్తైన జాతీయ జెండా ఉంది. దీని ఎత్తు అట్టారీ బార్డర్ లో ఉన్న జెండా కన్నా ఒక అడుగు ఎక్కువ.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!