Taliban: తాలిబాన్ మంత్రి భారత పర్యటన.. ఆఫ్ఘాన్ “జెండా”పై పంచాయతీ..
- భారత పర్యటనకు తొలిసారిగా ఆఫ్ఘాన్ తాలిబాన్ మంత్రి..
- రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు..
- తాలిబాన్ మంత్రి పర్యటన ముందు ‘‘జెండా’’ పంచాయతీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఐక్యరాజ్యసమితి అనుమతి పొందిన తర్వాత, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత పర్యటనకు వస్తున్నారు. ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకీకి, భారత పర్యటన కోసం యూఎన్ అనుమతి ఇచ్చింది. 2021లో ఆఫ్ఘాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, ఓ తాలిబాన్ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. భారత, తాలిబాన్ అధికారులు పలుమార్లు యూఏఈ వేదికగా చర్చించారు. ఆఫ్ఘాన్కు మానవతా సాయం కింద భారత్ సాయపడుతూనే ఉంది.
ముత్తాకీ తన పర్యటనలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(EAM), జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్లను కలిసే అవకాశం ఉంది.ఈ సమావేశాన్ని అన్ని దేశాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ ఈ పర్యటనపై భయంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కు తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. పాక్ తాలిబాన్లు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ ఆర్మీ, పోలీసులు టార్గెట్గా దాడులు చేస్తున్నారు. అయితే, ఈ దాడులకు ఆఫ్ఘాన్లోని తాలిబాన్లు సహకరిస్తున్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇప్పటికే, పాకిస్తాన్-ఆఫ్ఘాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం కొనసాగుతోంది.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
ఆఫ్ఘనిస్తాన్లో ఏ విదేశీ సైన్యం కూడా మోహరించే చర్యను రష్యా, చైనా, భారత్ సహా ఏడు దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కాబూల్లోని బగ్రామ్ ఏయిర్బేస్ని ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Virender Sehwag Wife: షాకింగ్.. బీసీసీఐ అధ్యక్షుడితో సెహ్వాగ్ సతీమణి డేటింగ్?
జెండాపై పంచాయతీ:
అయితే, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి పర్యటన ఇప్పుడు కొత్త సందిగ్ధతకు కారణమవుతోంది. రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల సమయంలో ఇరు దేశాల జెండాలు నాయకులు వెనకాల లేదా టేబుల్పై ఉంచాలి. కానీ ఇప్పటి వరకు భారత్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. తాలిబాన్ జెండాకు అధికార హోదాను ఇవ్వలేదు. ఇప్పటి వరకు న్యూఢిల్లీలో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో తాలిబాన్లు తమ జెండాను ఎగరవేయడానికి అనుమతించలేదు. ఈ జెండాపై ఇస్లామిక్ విశ్వాసానికి సంబంధించిన పదాలు ఉంటాయి. తాలిబాన్ల కన్నా ముందు ఉన్న ఆఫ్ఘన్ జెండా మాత్రమే రాయబార కార్యాలయంలో ఉంది.
భారత అధికారులు, ముత్తాకి మధ్య గతంలో జరిగిన సమావేశాల్లో తాలిబాన్ జెండాను ఉపయోగించారు. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ముత్తాకీ మధ్య జరిగిన సమావేశంలో రెండు దేశాల జెండాలు లేకుండానే సమావేశం జరిగింది.
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!