Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్పై తల్హా సయీద్ విషం
- భారత్పై మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన లష్కర్ ఉగ్రవాది తల్హా సయీద్.
- బతికున్నంతకాలం జిహాద్ కొనసాగిస్తామని ప్రకటన.
- భారత ఉపఖండంలో ముస్లింలు 500 ఏళ్లు పాలించారంటూ వ్యాఖ్య.
- ఢిల్లీ ఎవరిదో మరిచిపోయారా? అంటూ కవ్వించే ప్రయత్నం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talha Saeed: లష్కరే తోయిబా (LeT) అధినేత హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హ సయీద్ భారత్పై మరోసారి విషంకక్కాడు. భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని 500 ఏళ్ల పాటు ముస్లింలు పాలించారని ప్రస్తావించిన లష్కర్ ఉగ్రవాది.. ఢిల్లీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్పై ప్రశంసలు కురిపించారు.
ఇటీవల పాకిస్తాన్లోని షేక్ పురాలో ఒక కార్యక్రమంలో తల్హా సయీద్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే భారత్ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ను ఉద్దేశిస్తూ.. ఢిల్లీ ఎవరిదో, ఈ ప్రాంతాలన్నీ ఎవరివో చరిత్ర మరిచిపోయారా? అంటూ ముస్లిం పాలనను ఎత్తిచూపాడు. తాము బతికున్నంత కాలం జిహాద్ కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. తాము జిహాద్కు ప్రతిజ్ఞ చేసినవారమని, తమలో శక్తి ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నాడు.
Also Read
- Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
- CM Vijay: పోలీసులు పవర్ సెంటర్గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
- HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ గురించి మాట్లాడుతూ.. మునీర్ ఖురాన్ను కంఠస్థం చేసిన వ్యక్తి అని, ఆయన విశ్వాసం, భక్తి, జిహాద్ వంటి భావనలను తిరిగి ముందు తెచ్చారని ప్రశంసించారు. మునీర్ను పాకిస్తాన్కు లభించిన అదృష్టంగా అభివర్ణించాడు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధం గురించి చాలా స్పష్టమవుతోంది. తల్హా సయీద్ను అమెరికా, భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. ఇతడు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నాడు. అమెరికా 2012లో అతడిని ఉగ్రవాదిగా గుర్తించగా, భారత్ 2022లో UAPA కింద వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. LeTను ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాద సంస్థగా జాబితా చేసింది.
Pakistan: UN designated terrorist Hafiz Saeed's son Talha Saeed warns India while praising failed marshal munir's J!h◇d support:
“As long as we are alive, we will continue J!h◇d and sacrifices. We won’t stop.”
“Who ruled Delhi for 500 years, and whose Delhi was this?”…
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 6, 2026
తాజావార్తలు
-
Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్పై తల్హా సయీద్ విషం
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Romanchakam సక్సెస్ జోష్లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!