Taj Mahal: వహ్.. తాజ్. 144 కట్టడాల్లో టాప్లో నిలిచిన తాజ్మహల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taj Mahal: ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే మన దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడంగా తాజ్మహల్ టాప్లో నిలిచింది. టికెట్ల కొనుగోళ్ల ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా ఇన్కమ్ని సంపాదించింది. అంటే నెలకు యావరేజ్గా 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంరక్షణలో ఉన్న మొత్తం 144 కట్టడాల్లో తాజ్మహల్ నంబర్-1 స్థానాన్ని ఆక్రమించటం విశేషం. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ఏటా 70 నుంచి 80 లక్షల మంది వరకు వస్తుంటారు. ఇందులో 8 లక్షల మందికి పైగా విదేశీయులే ఉంటారు.
తాజ్మహల్ ఎంట్రీ టికెట్ ధర లోకల్వాళ్లకు రూ.50 కాగా విదేశీయుల నుంచి ఏకంగా రూ.1,100 వసూలు చేస్తున్నారు. అందువల్ల ఈ మోముమెంట్కి వచ్చే మొత్తం రెవెన్యూలో అత్యధిక వాటా ఇతర దేశాలవాళ్లదే అవుతోంది. స్థానికుల ద్వారా రూ.40 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుండగా ఫారనర్స్ ద్వారా రూ.110 కోట్లు వస్తుండటం గమనార్హం. తమిళనాడులోని మామళ్లపురం కట్టడాల సముదాయంతోపాటు భువనేశ్వర్లోని సూర్యదేవాలయంతో పోల్చితే తాజ్మహల్కి 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోటతో పోల్చితే 5 రెట్లు అధిక రెవెన్యూ జనరేట్ అవుతోంది.
Also Read
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
read also:
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ ముఖ్యమంత్రి.. కారణం ఏంటంటే?
అయితే.. తాజ్మహల్ ఆదాయం 2020తో పోల్చితే ఈసారి 74 శాతం తగ్గింది. కరోనా ఆంక్షలే దీనికి కారణం. 2020లో రూ.97 కోట్ల రెవెన్యూ రాగా ప్రస్తుతానికి రూ.25.6 కోట్లే వచ్చింది. 2021లో కూడా కొవిడ్ వల్ల లక్ష మంది సందర్శకులు తగ్గారు. కానీ ఈసారి మొదటి 5 నెలల్లోనే 4 లక్షల మందికి పైగా టూరిస్టులు వచ్చారు. అంటే నెలకి సగటున లక్ష మందికి పైగా వచ్చారు. మహమ్మారి కారణంగా ఈ ఏడాది మన దేశంలోని టాప్-10 చారిత్రక కట్టడాల్లో ఏకంగా ఏడింటి రెవెన్యూ 50 శాతానికి పైగా పడిపోయింది.
తాజ్మహల్ 74 శాతం, మౌసోలియం 35, రెడ్ఫోర్ట్ 63, కుతుబ్మీనార్ 75, ఆగ్రా కోట 86, మామళ్లపురం 49, కోణార్క్లోని సన్ టెంపుల్ 70 శాతం, చిత్తోర్గఢ్ ఫోర్ట్ 26, గోల్కొండ 53, హంపి 56 శాతం ఆదాయాలను కోల్పోయాయి. ఈ ఏడాది మే నాటికి ఉత్తరప్రదేశ్లోని తాజ్మహల్ తర్వాత మౌసోలియం కట్టడం రూ.6.3 కోట్ల రెవెన్యూని ఆర్జించింది.
ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ రూ.6 కోట్లు, కుతుబ్మీనార్ రూ.5 కోట్లు, యూపీలోని ఆగ్రా కోట రూ.4 కోట్లు, మామళ్లపురంలోని చారిత్రక కట్టడాల సముదాయం రూ.3.9 కోట్లు, ఒడిశాలోని సూర్యదేవాలయం 2.4 కోట్లు, రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ పోర్ట్ 2.3 కోట్లు, తెలంగాణ(హైదరాబాద్)లోని గోల్కొండ కోట 2.2 కోట్లు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు రూ.1.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.
తాజావార్తలు
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!