Taj Mahal: వహ్.. తాజ్. 144 కట్టడాల్లో టాప్లో నిలిచిన తాజ్మహల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taj Mahal: ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే మన దేశంలో ఎక్కువ మంది సందర్శించిన చారిత్రక కట్టడంగా తాజ్మహల్ టాప్లో నిలిచింది. టికెట్ల కొనుగోళ్ల ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా ఇన్కమ్ని సంపాదించింది. అంటే నెలకు యావరేజ్గా 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంరక్షణలో ఉన్న మొత్తం 144 కట్టడాల్లో తాజ్మహల్ నంబర్-1 స్థానాన్ని ఆక్రమించటం విశేషం. ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ఏటా 70 నుంచి 80 లక్షల మంది వరకు వస్తుంటారు. ఇందులో 8 లక్షల మందికి పైగా విదేశీయులే ఉంటారు.
తాజ్మహల్ ఎంట్రీ టికెట్ ధర లోకల్వాళ్లకు రూ.50 కాగా విదేశీయుల నుంచి ఏకంగా రూ.1,100 వసూలు చేస్తున్నారు. అందువల్ల ఈ మోముమెంట్కి వచ్చే మొత్తం రెవెన్యూలో అత్యధిక వాటా ఇతర దేశాలవాళ్లదే అవుతోంది. స్థానికుల ద్వారా రూ.40 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుండగా ఫారనర్స్ ద్వారా రూ.110 కోట్లు వస్తుండటం గమనార్హం. తమిళనాడులోని మామళ్లపురం కట్టడాల సముదాయంతోపాటు భువనేశ్వర్లోని సూర్యదేవాలయంతో పోల్చితే తాజ్మహల్కి 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోటతో పోల్చితే 5 రెట్లు అధిక రెవెన్యూ జనరేట్ అవుతోంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
read also:
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ ముఖ్యమంత్రి.. కారణం ఏంటంటే?
అయితే.. తాజ్మహల్ ఆదాయం 2020తో పోల్చితే ఈసారి 74 శాతం తగ్గింది. కరోనా ఆంక్షలే దీనికి కారణం. 2020లో రూ.97 కోట్ల రెవెన్యూ రాగా ప్రస్తుతానికి రూ.25.6 కోట్లే వచ్చింది. 2021లో కూడా కొవిడ్ వల్ల లక్ష మంది సందర్శకులు తగ్గారు. కానీ ఈసారి మొదటి 5 నెలల్లోనే 4 లక్షల మందికి పైగా టూరిస్టులు వచ్చారు. అంటే నెలకి సగటున లక్ష మందికి పైగా వచ్చారు. మహమ్మారి కారణంగా ఈ ఏడాది మన దేశంలోని టాప్-10 చారిత్రక కట్టడాల్లో ఏకంగా ఏడింటి రెవెన్యూ 50 శాతానికి పైగా పడిపోయింది.
తాజ్మహల్ 74 శాతం, మౌసోలియం 35, రెడ్ఫోర్ట్ 63, కుతుబ్మీనార్ 75, ఆగ్రా కోట 86, మామళ్లపురం 49, కోణార్క్లోని సన్ టెంపుల్ 70 శాతం, చిత్తోర్గఢ్ ఫోర్ట్ 26, గోల్కొండ 53, హంపి 56 శాతం ఆదాయాలను కోల్పోయాయి. ఈ ఏడాది మే నాటికి ఉత్తరప్రదేశ్లోని తాజ్మహల్ తర్వాత మౌసోలియం కట్టడం రూ.6.3 కోట్ల రెవెన్యూని ఆర్జించింది.
ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ రూ.6 కోట్లు, కుతుబ్మీనార్ రూ.5 కోట్లు, యూపీలోని ఆగ్రా కోట రూ.4 కోట్లు, మామళ్లపురంలోని చారిత్రక కట్టడాల సముదాయం రూ.3.9 కోట్లు, ఒడిశాలోని సూర్యదేవాలయం 2.4 కోట్లు, రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ పోర్ట్ 2.3 కోట్లు, తెలంగాణ(హైదరాబాద్)లోని గోల్కొండ కోట 2.2 కోట్లు, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు రూ.1.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!