Maharashtra: మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- నేటితో ముగియనున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గడువు..
- ముఖ్యమంత్రి రేస్ నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్లు ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు (మంగళవారం)తో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలో సీఎం పదవిపై కూటమిలో వాదనలు, ప్రతివాదనలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోసం పట్టుబడుతుండగా.. ఇంకోవైపు ఏక్ నాథ్ షిండేను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని శివసేన (షిండే) వర్గం డిమాండ్ చేస్తోంది. సీఎం పదవికి సంబంధించి ఢిల్లీలోనే నిర్ణయం తీసుకుంటారని మొదట చర్చ కొనసాగింది. ఈ పరిణామాలన్నింటిలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం హస్తినకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ముంబైకి వచ్చేశారు. అయితే, ఢిల్లీ వెళ్లిన ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవకుండానే వచ్చేశారనే చర్చ కొనసాగుతుంది.
Read Also: Gold Price Today: ఇది కదా కావాల్సింది.. తులం బంగారంపై రూ.1310 తగ్గింది!
Also Read
కాగా, మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీయే కూటమికి కత్తి మీద సాములా మారింది. మూడు పార్టీల కలయికతో విజయం సాధించిన మహయుతి కూటమిలో ఎవర్ని ముఖ్యమంత్రిని చేయాలని సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో భారీ విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో 132 స్థానాల్లో గెలుచింది.
Read Also: Occult Worship: మంథని హాస్టల్లో దారుణం.. లక్ష్మీదేవి కటాక్షం పేరుతో విద్యార్థులతో నగ్న పూజలు..!
అయితే, మహాయుతి ముఖ్యమంత్రి పదవిపై ఢిల్లీలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలువురు హస్తినపై దృష్టి సారించారు. తాజాగా, సీఎం రేసు నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్లు సమాచారం. తనకు మద్దతుగా ముంబైకి ఎవరు రావొద్దు.. సమావేశాలు పెట్టొద్దని ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకున్నారనడానికి నిదర్శనమన్న ప్రచారం కొనసాగుతుంది. త్వరలోనే మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పడుతుంది.. రాష్ట్ర అభివృద్ధి కోసం మహాయుతి కూటమి పని చేస్తుందని షిండే పేర్కొన్నారు.
महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024
తాజావార్తలు
-
APL 2026: చివరి బంతి వరకు ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్ సంచలన విజయం
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!