Qatar-India: “మా సైనిక శిక్షణే కారణం”.. ఖతార్ ఉరిశిక్ష నుంచి బయటపడిన మాజీ నేవీ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar-India: ఖతార్ దేశంలో గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించబడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు, శిక్ష నుంచి బయటపడ్డారు. ఇటీవల వారంతా భారతదేశానికి వచ్చారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా భావించబడుతోంది. జలంతర్గామి నిర్మాణంలో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని చెబుతూ ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం కలుగజేసుకుని వారిని శిక్ష నుంచి తప్పించగలిగింది.
ఈ నేపథ్యంలో భారత్ తిరిగి వచ్చిన మాజీ నేవీ అధికారి తన అనుభవానలు చెప్పారు. రాగేష్ గోపకుమార్ అక్కడి జైళ్లలో కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించారు. తాను తిరిగి సొంత ఊరు తిరువనంతపురం చేసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబంతో తిరిగి కలుస్తున్నందుకు ఆనందం మరియు కృతజ్ఞతలు తెలిపారు. తాను, తన సహచరులు తమ సైనిక శిక్షణ కారణంగా మానసికంగా ధృడంగా ఉన్నామని, ఈ శిక్షణ మాకు ఉపయోగపడిందని, బతికిపోయామని చెప్పారు.
Also Read
- Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
- Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
- Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం
- India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
గోపకుమార్ సోమవారం తిరువనంతపురానికి 16 కిలోమీటర్ల దూరం ఉన్న బలరామపురానికి చేరుకున్నారు. కుటుంబాన్ని చూడగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. రోజూ ఐదారుసార్లు ఫోన్ చేసే భర్త, తన భార్యకు ఫోన్ చేయడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆరా తీసిన సమయంలో, తన కుటుంబం ఎంత దీనస్థితిలో ఉందో అర్థమయ్యేదని, తన కుటుంబ ప్రార్థనలు, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల వల్లే తాము మళ్లీ స్వదేశానికి వచ్చామని అన్నారు. తమను విడిపించేందుకు చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీజీ జోక్యం చేసుకుంటే తిరిగి స్వదేశానికి వస్తామని తెలుసని, అయితే ఎన్ని రోజులు పడుతుందో తెలియదని గోపకుమార్ అన్నారు.
Read Also: Ramam Raghavam: నా ప్రేమ మొదలయ్యింది నీతోనే డాడీ.. ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యేలానే ఉన్నాడు
ఒక భారతీయ వ్యక్తి అమాయకుడై, విదేశాల్లో జైలు శిక్ష విధించబడితే, మన ప్రధాని ఆదుకుంటారని, ఈ విషయాన్ని ప్రతీ భారతీయులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. 2017లో ఇండియన్ నుంచి రిటైర్ అయినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒమన్ డిఫెన్స్ ట్రైనింగ్ కంపెనీలో కమ్యూనికేషన్స్ ఇన్స్ట్రక్టర్గా చేరానని గోపకుమార్ తెలిపారు.
గతేడాది అక్టోబర్ 26న 8 మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ శిక్షను డిసెంబర్ 28న మరణశిక్ష నుంచి మూడు నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ నెలలో దుబాయ్లో జరిగిన COP28 సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశమై దీనిపై చర్చించారు.
తాజావార్తలు
-
Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
-
Veerabhadruni Rahasyam : గుడి గంట మోగితే శవం లేవాల్సిందేనా? ఓటీటీలోకి భయపెట్టే ‘వీరభద్రుని రహస్యం’
-
Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
-
Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!