BJP: కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం..
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో అధికారం బీజేపీదే..
- రెండేళ్లలోనే ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తి..
- సీఎంగా మాత్రం సిద్ధరామయ్య వైపే జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్గా ఉన్నారని సర్వే చెప్పింది.
మొత్తం, 10,481 మంది సర్వేలో ప్రతిస్పందించారు. సర్వే ప్రకారం, బీజేపీ పూర్తి మెజారిటీతో 136-159 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 51 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కి 40.3 శాతం (2023లో 42.88శాతం) ఓట్లతో 53-82 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. జేడీఎస్ 5 శాతం ఓట్లతో 3-6 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే చెప్పింది. కర్ణాటకలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి, అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Perni Nani: అధికారంలోకి రాగానే మాట మార్చేశారు..? పవన్ కల్యాణ్పై పేర్నినాని ఫైర్..
బీజేపీ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో గత 20 ఏళ్ల నుంచి ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ మూడు సార్లు -2004, 2008, 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 113ని సాధించి ఎప్పుడూ అధికారాన్ని చేపట్టలేదు. ముఖ్యమంత్రిగా మాత్రం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య 29.2 శాతం ఓటర్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత 10.7 శాతం ఓట్లతో డీకే శివకుమార్ రెండో ప్లేస్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు బి.ఎస్. యడియూరప్ప (5.5 శాతం), బసవరాజ్ బొమ్మై (3.6 శాతం) మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర (5.2 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, కర్ణాటక ప్రజలు ప్రధానిగా మరోసారి నరేంద్రమోడీ వైపే నిలిచారు. నరేంద్రమోడీకి 59 శాతం మంది సపోర్ట్ చేయగా, రాహుల్ గాంధీకి 17 శాతం, యోగి ఆదిత్యనాథ్కి 11 శాతం మంది ప్రతివాదులు మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..