BJP: కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం..
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో అధికారం బీజేపీదే..
- రెండేళ్లలోనే ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తి..
- సీఎంగా మాత్రం సిద్ధరామయ్య వైపే జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్గా ఉన్నారని సర్వే చెప్పింది.
మొత్తం, 10,481 మంది సర్వేలో ప్రతిస్పందించారు. సర్వే ప్రకారం, బీజేపీ పూర్తి మెజారిటీతో 136-159 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 51 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కి 40.3 శాతం (2023లో 42.88శాతం) ఓట్లతో 53-82 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. జేడీఎస్ 5 శాతం ఓట్లతో 3-6 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే చెప్పింది. కర్ణాటకలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి, అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు.
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
Read Also: Perni Nani: అధికారంలోకి రాగానే మాట మార్చేశారు..? పవన్ కల్యాణ్పై పేర్నినాని ఫైర్..
బీజేపీ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో గత 20 ఏళ్ల నుంచి ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ మూడు సార్లు -2004, 2008, 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 113ని సాధించి ఎప్పుడూ అధికారాన్ని చేపట్టలేదు. ముఖ్యమంత్రిగా మాత్రం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య 29.2 శాతం ఓటర్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత 10.7 శాతం ఓట్లతో డీకే శివకుమార్ రెండో ప్లేస్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు బి.ఎస్. యడియూరప్ప (5.5 శాతం), బసవరాజ్ బొమ్మై (3.6 శాతం) మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర (5.2 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, కర్ణాటక ప్రజలు ప్రధానిగా మరోసారి నరేంద్రమోడీ వైపే నిలిచారు. నరేంద్రమోడీకి 59 శాతం మంది సపోర్ట్ చేయగా, రాహుల్ గాంధీకి 17 శాతం, యోగి ఆదిత్యనాథ్కి 11 శాతం మంది ప్రతివాదులు మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!