Demonetisation: పెద్ద నోట్ల రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court’s constitution bench verdict on demonetisation on January 2: ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది. శీతాకాలం సెలవుల తర్వాత జనవరి 2న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుంది.
నోట్ల రద్దు విషయంపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత డిసెంబర్ 7న తీర్పును రిజర్వ్ చేసింది. నోట్ల రద్దు ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం నిర్దేశించిన అధికారాలు, విధానానికి విరుద్ధమని వాదనలు జరిగాయి. నోట్ల రద్దుపై ఏర్పడిన అత్యున్నత సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గావాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఎఎస్ బోపన్న, వి. రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
Read Also: Train Derail: పట్టాలు తప్పిన ముంబై-జోధ్పూర్ రైలు..
నల్లధనం, ఉగ్రవాద కార్యకలాపాలకు, బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టాలని నవంబర్ 8, 2016లో బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం, 1934లోని సెక్షన్ 26 (2) ప్రకారం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును చేపట్టింది. ఈ నిర్ణయం తరువాతి రోజు నుంచి రూ.500, రూ.1000 రద్దు చేయబడ్డాయి. ఈ నోట్లను డిసెంబర్ 30, 2016 వరకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం సమయంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న రూ. 17.97 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉంది. నోట్ల రద్దుతో రద్దు చేయబడిని కరెన్సీ విలువ రూ. 15.44 లక్షల కోట్లలో రూ. 15.31 లక్షల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పిటిషనర్ల తరుపున పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు పెంచే యోచన, టెర్రర్ ఫండింగ్, బ్లాక్ మనీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంది. గతంలో 1946, 1978లో ఇలాంటి నోట్ల రద్దు జరిగింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!