Supreme Court: ఈడీని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court key judgment on Anti-Money Laundering Cases: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును బుధవారం వెలువరించింది. ఈడీ అరెస్ట్ చేసే అధికారంలో పాటు ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం( పీఎంఎల్ఏ)లోని నేర పరిశోధన, అరెస్ట్ అధికారం, ఆస్తుల అటాచ్మెంట్ మొదలైన నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. మనీలాండరింగ్ అరెస్టులు ‘‘ఏకపక్షం’’ కానది సంచలన ఉత్తర్వుల ఇచ్చింది.
అరెస్టుకు గల కారణాలను, సాక్షాధారాలను తమకు తెలియకుండా నిందితులను అరెస్ట్ చేసే అధికారం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదించారు. విచారణ సమయంలో నిందితుడి నుంచి ఈడీ దోహపూరిత వాంగ్మూలాన్ని నమోదు చేయడం కూడా చట్టవ్యతిరేకం అని పిటిషనర్ల తరుపున వాదనలు వినిపించారు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ని ఎఫ్ఐఆర్తో పోల్చలేమని.. ఇసిఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతర్గత పత్రమని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులకు ఇసిఐఆర్ ఇవ్వడం తప్పనిసరి కాదని.. అరెస్టు సమయంలో కారణాలను మాత్రమే బహిర్గతం చేస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
కేంద్రం తరుపున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా మనీలాండరింగ్ నేరాల తీవ్రతను సుప్రీంకోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ నిరంతర నేరమని ఆయన కోర్టుకు వివరించారు. ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లో కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ కార్తీ చిదంబరం, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు మరికొంత మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు ఈడీకి అనుకూలంగా కీలక తీర్పును వెల్లడించింది. మనీలాండరింగ్ కేవలం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి అవినీతి వ్యాపారుల ద్వారానే కాకుండా ఉగ్రవాద గ్రూపుల ద్వారా కూడా నిర్వహించబడుతోందని.. మనీలాండరింగ్ దేశ సమగ్రతకే కాకుండా సార్వభౌమాత్వానికి ముప్పు కలిగిస్తుందని పీఎంఎల్ఏ నిబంధనలను సమర్థించింది.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!