RG Kar Doctor case: సంజయ్రాయ్కి మరణశిక్షపై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
- ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసు సుమోటోగా స్వీకరణ
- సంజయ్రాయ్కి మరణశిక్షపై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి కోర్టు జీవితఖైదు విధించింది. రూ.50,000 జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితుడికి మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది.
అయితే నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ పెరగడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. దీంతో ఈ కేసును బుధవారం విచారించనుంది. జనవరి 20న సీల్దా కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది.
Also Read
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
- Hamirpur: కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు మృతి.!
ఆగస్టు 9. 2024న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అయితే ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక ఈనెల 20న సీల్దా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించారు. సెక్షన్ 64 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఐదు నెలల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. అదనంగా సెక్షన్ 66 ప్రకారం అతనికి మరణశిక్ష వరకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని న్యాయమూర్తి దాస్ తెలిపారు. ఈ నేరం అరుదైన కేటగిరీ కిందకు రాదని, దోషికి మరణశిక్ష విధించకపోవడాన్ని న్యాయమూర్తి సమర్థించారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జనవరి 21న దోషికి మరణశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీర్పును విమర్శించారు. ‘‘ఇది నిజంగా మరణశిక్షను కోరే అరుదైన కేసు అని నేను నమ్ముతున్నాను. ఇది అరుదైన కేసు కాదని తీర్పు ఎలా నిర్ధారణకు వచ్చింది?!’’ అమె ధ్వజమెత్తింది.
తాజావార్తలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!