RG Kar Doctor case: సంజయ్రాయ్కి మరణశిక్షపై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
- ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసు సుమోటోగా స్వీకరణ
- సంజయ్రాయ్కి మరణశిక్షపై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి కోర్టు జీవితఖైదు విధించింది. రూ.50,000 జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితుడికి మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది.
అయితే నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ పెరగడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. దీంతో ఈ కేసును బుధవారం విచారించనుంది. జనవరి 20న సీల్దా కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది.
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
ఆగస్టు 9. 2024న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అయితే ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక ఈనెల 20న సీల్దా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించారు. సెక్షన్ 64 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఐదు నెలల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. అదనంగా సెక్షన్ 66 ప్రకారం అతనికి మరణశిక్ష వరకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని న్యాయమూర్తి దాస్ తెలిపారు. ఈ నేరం అరుదైన కేటగిరీ కిందకు రాదని, దోషికి మరణశిక్ష విధించకపోవడాన్ని న్యాయమూర్తి సమర్థించారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జనవరి 21న దోషికి మరణశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీర్పును విమర్శించారు. ‘‘ఇది నిజంగా మరణశిక్షను కోరే అరుదైన కేసు అని నేను నమ్ముతున్నాను. ఇది అరుదైన కేసు కాదని తీర్పు ఎలా నిర్ధారణకు వచ్చింది?!’’ అమె ధ్వజమెత్తింది.
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!