CAA: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court set to hear pleas challenging Citizenship Amendment Act (CAA) on September 12: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)-2019కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 12న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడిన ధర్మాసనం ఈ అంశానికి వ్యతిరేకంగా నమోదైన 200కి పైగా పిటిషన్లను విచారించనుంది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో నిరసన, ఆందోళనలు జరిగాయి.
డిసెంబర్ 31,2014 నాటికి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రిస్టియన్ కమ్యూనిటీలకు కెందిన వారికి భారత పౌరసత్వాన్ని ఇచ్చే విధంగా సీఏఏ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారి తీసింది. సీఏఏను డిసెంబర్11, 2019న పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం 2019 డిసెంబర్ 12న నోటిఫై చేయబడింది. అయితే ఈ లోపే కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ చట్టం పక్కకు వెళ్లింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తం పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సెప్టెంబర్ 12, సోమవారం రోజున సుప్రీంకోర్టు విచారించనుంది.
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
Read Also: Sitaram Yechury: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం అవుతున్నాయి.. 2024లో బీజేపీ ఓడిపోతుంది.
పార్లమెంట్ ఆమోదించి నోటిఫై చేసినప్పటికీ.. ఈ చట్టానికి సంబంధించి రూల్స్ ఇంకా రూపొందించలేదు. దీంతో ఈ సీఏఏ బిల్లు కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ ఏడాది మే నెలలో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఓ ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కోవిడ్ మహమ్మారి ముగిసిన తర్వాత ఈ చట్టం అమలులోకి వస్తుందని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని బీజేపీ వ్యాఖ్యలు చేస్తోంది. 2024 ఎన్నికల లోపు సీఏఏ చట్టం అమలులోకి వస్తుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని విపక్షపాలిత రాష్ట్రాలు సీఏఏను అనుమతించేది లేదని చెబుతున్నాయి. గతంలో సీఏఏపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీజేపీ సీఏఏను అమలు చేయాలని అనుకుంటే అది తన మృతదేహాంపై చేయాల్సి ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!