Supreme Court: దేశాన్ని నాశనం చేస్తుంది అవినీతిపరులే.. “ఎమ్మెల్యేల కొనుగోలు బేరాల వీడియోలు చూశాం”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court sensational comments against corrupt people: దేశంలో అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయిన కార్యకర్త గౌతమ్ నావలఖ తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా తనను జ్యుడిషియల్ రిమాండ్ నుంచి గృహ నిర్భంధంలోకి మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులు ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే గౌతమ్ నావలఖ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరుపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. గౌతమ్ వంటి వారి వల్ల దేశం నాశనం అవుతుందని.. వారి పని అదే అని సుప్రీంకోర్టు ముందు వాదించారు.
Read Also: Twitter: భారత్లో కొత్తగా ట్విట్టర్ “అఫిషియల్ టిక్” ప్రారంభం..
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
అయితే ఆయన వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం అసలు దేశం ఎవరి వల్ల నాశనం అవుతుందో తెలుసా అంటూ అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు. ప్రభుత్వ కార్యాలయాలకు వెల్లి అక్కడ చూస్తే అవినీతి విషయాలు బయపడుతాయని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారతున్నాయని.. అయినా అవినీతిపరులపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వ్యాక్యానించింది. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్ల రూపాయాలతో బేరం ఆడుతున్న వ్యక్తుల వీడియో చూశామని గుర్తు చేసింది. అయినప్పటికీ కళ్లు మూసుకోని ఉన్నామని న్యాయమూర్తులు కామెంట్స్ చేశారు. ఇలాంటి వారు దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయడం లేదని మీరు చెబుతున్నారా..? అని ప్రశ్నించింది.
ఇలాంటి వారిని సమర్థించపోయినప్పటికీ..వారు ఉత్సాహంగా ముందుకెళ్తున్నారని వారిని బయటకు తీసుకువచ్చేందుకు డబ్బు సంచులు సాయపడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై తాము అవినీతిపరులను సమర్థించడం లేదని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని అదనపు సొలిసిటర్ జనరల్ అన్నారు. గౌతమ్ నావలఖను గృహనిర్భంధంలో ఉంచేందుకు ఎలాంచి నియమనిబంధనలు పెడతారో తెలియజేయాల్సిందిగా ఎన్ఐఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Ind Vs Pak: పాకిస్తాన్పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్ల్లో 14 సార్లు భారత్దే గెలుపు.. నేడు మరో సమరం..
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!