Supreme Court: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అందులో జోక్యం చేసుకోలేం
- ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం..
- ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు ఎగుమతి చేయడాన్ని నిషేధించాలని పిటిషన్..
- విదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని పిల్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్ను ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొనింది.
Read Also: CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల సాయం.. సీఎం చంద్రబాబు అభినందనలు
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
కాగా, ఈ విధంగా ఆదేశాలిస్తే.. ఆయుధాల ఎగుమతిలో భాగమైన సంస్థలు ఒప్పందాల ఉల్లంఘించాయంటూ దావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.. అందుకే ఆ సంస్థలను నిలువరించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనింది. ఇలాంటి విషయాలు విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయని తెలిపింది. అయితే, అశోక్ కుమార్ శర్మ, మరికొందరు వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేసే భారతీయ సంస్థల లైసెన్సు క్యాన్సిల్ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అందులో చెప్పుకొచ్చారు.
Read Also: Bigg Boss Telugu 8: సీజన్ 1 నుంచే ఆంటీల సెంటిమెంట్.. ఫస్ట్ వీక్ బయటకొచ్చేసిన వారి లిస్ట్ ఇదే!
ఇక, గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి చేయడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలు పెట్టడంతో.. అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గాజాలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న ఈ పోరులో 40 వేల మందికిపైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు విడిచారని స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్ దాడిని ఖండించిన భారత్.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యం కావడంతో.. ఇటీవల ఆరుగురు బందీలు మరణించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చర్చలు సక్సెస్ కావడానికి తగిన ప్రయత్నాలను బెంజిమన్ నెతన్యాహు చేయడం లేదని పరోక్షంగాణ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!