Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- న్యాయవ్యవస్థలో అవినీతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్
- విద్యావేత్తలపై విధించిన నిషేధం ఎత్తివేత
- ధర్మాసనం నిర్ణయంపై విస్మయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య కాలంలో ఎన్సీఈఆర్టీ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకంగా ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’ అనే పాఠంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్ అయింది. గత ఫిబ్రవరిలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థను గురించి విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తున్నారని ఫైర్ అయింది. దీంతో ఎన్సీఈఆర్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అభ్యంతరకర పాఠ్యాంశాలను వెబ్సైట్ నుంచి తొలగించి.. పుస్తకాల పంపిణీని నిలిపివేసింది.
తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముగ్గురు విద్యావేత్తలపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అలాగే వారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించారన్న వ్యాఖ్యలను కూడా న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రొఫెసర్ మైఖేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లపై మార్చి 11న జారీ చేసిన ఆదేశాలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ముగ్గురు విద్యావేత్తలను అకడమిక్ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచాలని ఇచ్చిన ఆదేశాన్ని తాజాగా రద్దు చేసింది.
Also Read
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
“దరఖాస్తుదారులు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత.. గత ఆదేశంలోని 8వ పేరాలో ఉన్న సూచనలను సవరించడం సముచితమని భావిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. అలాగే ఈ ముగ్గురు విద్యావేత్తలు కావాలనే వాస్తవాలను తప్పుగా చూపించారన్న వ్యాఖ్యలను కూడా ధర్మాసనం వెనక్కి తీసుకుంది. వారు ఇచ్చిన వివరణల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2026లో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న కొన్ని అంశాలు వివాదానికి దారితీశాయి. మీడియా కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అనంతరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఆ భాగాన్ని “అనుకోకుండా జరిగిన పొరపాటు”గా పేర్కొంటూ పుస్తకం నుంచి తొలగించింది. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఆ పుస్తకం ముద్రణ, పంపిణీపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే పాఠ్యపుస్తకాల తయారీ, సిలబస్ రూపకల్పనలో ఈ ముగ్గురు నిపుణులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి న్యాయస్థానం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!