Supreme Court: కోల్కతా వైద్యురాలి పేరు, ఫోటోని తొలగించండి.. వికీపీడియాకు సుప్రీం ఆదేశం..
- కోల్కతా వైద్యురాలి పేరు.. ఫోటోలను తొలగించండి..
- బాధితురాలి గుర్తింపు వెల్లడించడాన్ని భారత చట్టాలు ఒప్పుకోవు..
- వికీపీడియాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించింది. బాధితురాలి గుర్తింపును ఏ విధంగా బహిర్గతం చేయకూడదని, బాధితురాలి ఫోటో, ఆమె గుర్తింపుకు సంబంధించి ఏదైనా కంటెంట్ వెంటనే తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు వికీపీడియాను ఆదేశించింది.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్లైన్లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
Read Also: PM Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు హిందూ దేవాలయంపై ఖలిస్తాన్ల దాడి
లైంగిక వేధింపుల బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఆ సమయంలో సీజేఐ అన్నారు. 2018లో నిపుల్ సక్సేనా కేసులో.. ఏ వ్యక్తి కూడా బాధితురాలు/బాధితుడి ఫోటోలను ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో బహిర్గం చేయకూడదు. ఇది వారి గుర్తింపుని ప్రజలకు విస్తృతంగా తెలియజేస్తుందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆగస్టు 09న ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ సెమినార్ హాలులో అర్ధనగ్నంగా మృతదేహమై కనిపించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా బాధితురాలికి న్యాయం చేయాలని నిరసనకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. అప్పటి కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!