Supreme Court: కోల్కతా వైద్యురాలి పేరు, ఫోటోని తొలగించండి.. వికీపీడియాకు సుప్రీం ఆదేశం..
- కోల్కతా వైద్యురాలి పేరు.. ఫోటోలను తొలగించండి..
- బాధితురాలి గుర్తింపు వెల్లడించడాన్ని భారత చట్టాలు ఒప్పుకోవు..
- వికీపీడియాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Supreme Court: కోల్కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించింది. బాధితురాలి గుర్తింపును ఏ విధంగా బహిర్గతం చేయకూడదని, బాధితురాలి ఫోటో, ఆమె గుర్తింపుకు సంబంధించి ఏదైనా కంటెంట్ వెంటనే తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు వికీపీడియాను ఆదేశించింది.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్లైన్లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: PM Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు హిందూ దేవాలయంపై ఖలిస్తాన్ల దాడి
లైంగిక వేధింపుల బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఆ సమయంలో సీజేఐ అన్నారు. 2018లో నిపుల్ సక్సేనా కేసులో.. ఏ వ్యక్తి కూడా బాధితురాలు/బాధితుడి ఫోటోలను ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో బహిర్గం చేయకూడదు. ఇది వారి గుర్తింపుని ప్రజలకు విస్తృతంగా తెలియజేస్తుందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆగస్టు 09న ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ సెమినార్ హాలులో అర్ధనగ్నంగా మృతదేహమై కనిపించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా బాధితురాలికి న్యాయం చేయాలని నిరసనకు దారి తీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. అప్పటి కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!