దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నరకయాతన పడుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. నగర వాసులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇంకోవైపు పార్లమెంట్ వేదికగా విపక్ష నాయకులు కూడా పోరాటం చేస్తున్నారు. అయినా కూడా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.