Supreme Court: మైనారిటీ గుర్తింపు.. కేంద్రంపై సుప్రీం అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనారిటీల గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… రాష్ట్ర స్థాయిలో హిందువులు సహా మైనారిటీలను గుర్తించే అంశంపై కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంభించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరియు మూడు నెలల్లో ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. తక్కువ జనాభా ఉన్న వర్గాన్ని మైనార్టీలుగా గుర్తించడమా లేదా అన్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే అని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.
Read also: Minister Peddireddy: కక్ష సాధింపు కాదు.. విచారణలో తేలింది
Also Read
అయితే, మైనారిటీలను నోటిఫై చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, రాష్ట్రాలు మరియు ఇతర వాటాదారులతో చర్చించిన తర్వాత ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తన మునుపటి స్టాండ్ను రద్దు చేస్తూ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎమ్ఎమ్సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్రాలతో 3 నెలల్లోపు సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రానికి అధికారాలు ఉన్నాయని మీరు అంటున్నారు. భిన్నత్వం ఉన్న మనలాంటి దేశంలో, మనం అర్థం చేసుకున్నాం.. కానీ, ఎవరైనా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అఫిడవిట్లను దాఖలు చేయడానికి ముందు ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో ఉంది, దాని స్వంత పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీరు చెప్పే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!