Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా?
- అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- వరకట్న వేధింపుల కేసులో తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య భారతదేశంలో వరకట్న వేధింపులతో ఎందరో అబలలు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ దగ్గర నుంచి ఎందరో వివాహితులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ ఘటనలు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేస్తుండగా.. కన్నవారికి వేదన మిగులుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఓ నిందితుడి కుటుంబానికి చీవాట్లు పెట్టింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఛత్తీస్గఢ్కు చెందిన ఓ వరకట్న కేసును శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. పెళ్లైన మూడేళ్లలోపే మహిళ అత్తగారింట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త, అతని కుటుంబ సభ్యులు నిరంతరం వరకట్నం వేధింపులకు గురి చేసి.. మానసికంగా వేధించడంతో ప్రాణాలు తీసుకుంది. దీంతో ఈ కేసులో ట్రయల్ కోర్టు నిందితులకు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును బీవీ. నాగారత్న, ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నిందితుడి కుటుంబానికి న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.
Also Read
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
‘‘అబ్బాయిలు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారు?, వరకట్నం పేరుతో వరుడి తరఫు వారు వధువుపైనా, ఆమె కుటుంబంపైనా ఒత్తిడి తెస్తారా?. వధువును, ఆమె కుటుంబాన్ని పీడించడమే లక్ష్యమా?, వధువు, ఆమె కుటుంబంపై వరకట్న వేధింపులు, అవమానాలను తక్షణమే అంతం కావాలి. వరకట్నం డిమాండ్లు, ఆర్థిక ఒత్తిడి కారణంగా వధువు కుటుంబం అవమానానికి గురికావడమే లక్ష్యమా.’’ అంటూ జస్టిస్ నాగారాత్న తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా భర్త తమ్ముడికి విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
ఈ కేసులో ట్రయల్ కోర్టు.. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ హైకోర్టు భర్త కుటుంబంలోని పలువురిని ఐపీసీలోని సెక్షన్లు 304బి (వరకట్నం మరణం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) మరియు 498ఎ (క్రూరత్వం, వేధింపులు) కింద దోషులుగా నిర్ధారించాయి. అయితే భర్త తమ్ముడు సెక్షన్ 498A కింద మాత్రమే అతని శిక్షను సవాలు చేశాడు. కానీ కోర్టు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. జస్టిస్ నాగారత్న మాట్లాడుతూ.. ‘‘సెక్షన్ 498A మాత్రమే వర్తిస్తుందని.. శిక్ష కేవలం మూడేళ్లేనని మీరు సంతోషించాలి” అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!