Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా?
- అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- వరకట్న వేధింపుల కేసులో తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య భారతదేశంలో వరకట్న వేధింపులతో ఎందరో అబలలు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ దగ్గర నుంచి ఎందరో వివాహితులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ ఘటనలు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేస్తుండగా.. కన్నవారికి వేదన మిగులుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఓ నిందితుడి కుటుంబానికి చీవాట్లు పెట్టింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఛత్తీస్గఢ్కు చెందిన ఓ వరకట్న కేసును శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. పెళ్లైన మూడేళ్లలోపే మహిళ అత్తగారింట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త, అతని కుటుంబ సభ్యులు నిరంతరం వరకట్నం వేధింపులకు గురి చేసి.. మానసికంగా వేధించడంతో ప్రాణాలు తీసుకుంది. దీంతో ఈ కేసులో ట్రయల్ కోర్టు నిందితులకు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును బీవీ. నాగారత్న, ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా నిందితుడి కుటుంబానికి న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.
Also Read
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
‘‘అబ్బాయిలు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారు?, వరకట్నం పేరుతో వరుడి తరఫు వారు వధువుపైనా, ఆమె కుటుంబంపైనా ఒత్తిడి తెస్తారా?. వధువును, ఆమె కుటుంబాన్ని పీడించడమే లక్ష్యమా?, వధువు, ఆమె కుటుంబంపై వరకట్న వేధింపులు, అవమానాలను తక్షణమే అంతం కావాలి. వరకట్నం డిమాండ్లు, ఆర్థిక ఒత్తిడి కారణంగా వధువు కుటుంబం అవమానానికి గురికావడమే లక్ష్యమా.’’ అంటూ జస్టిస్ నాగారాత్న తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా భర్త తమ్ముడికి విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
ఈ కేసులో ట్రయల్ కోర్టు.. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ హైకోర్టు భర్త కుటుంబంలోని పలువురిని ఐపీసీలోని సెక్షన్లు 304బి (వరకట్నం మరణం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) మరియు 498ఎ (క్రూరత్వం, వేధింపులు) కింద దోషులుగా నిర్ధారించాయి. అయితే భర్త తమ్ముడు సెక్షన్ 498A కింద మాత్రమే అతని శిక్షను సవాలు చేశాడు. కానీ కోర్టు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. జస్టిస్ నాగారత్న మాట్లాడుతూ.. ‘‘సెక్షన్ 498A మాత్రమే వర్తిస్తుందని.. శిక్ష కేవలం మూడేళ్లేనని మీరు సంతోషించాలి” అని అన్నారు.
తాజావార్తలు
-
Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!