Supreme Court: లఖింపూర్ ఖేరీ కేసు.. వారంలో లొంగిపోవాలని సుప్రీం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్ను రద్దు చేసింది సుప్రీంకోర్టు… అలహాబాద్ హైకోర్టు ఆశిష్మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం… అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.. కాగా, ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశాన్ని మళ్లీ విచారించేందుకు అలహాబాద్ హైకోర్టుకు ఈ అంశాన్ని తిరిగి పంపింది సుప్రీంకోర్టు.
Read Also: COVID 19: ఫోర్త్ వేవ్ టెన్షన్..! తెలంగాణ సర్కార్ అలెర్ట్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
కాగా, లఖింపూర్ ఖేరీ హింస కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు చట్టపరంగా సమర్థనీయం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం నిషేధించబడిన ఉత్తర్వుపై ఎలాంటి అప్పీల్కు ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమైనందున తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని వెల్లడించారు.. ఇక, అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరిలో ఆశిష్ మిశ్రా జైలు నుంచి కూడా బయటకు వచ్చారు.. ఇప్పుడు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు.. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశించింది. కాగా, అక్టోబర్ 3, 2020న లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే.. ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో.. రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత హింస చెలరేగిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..