CJI Gavai: న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో కాదు.. చట్టబద్ధంగా సాగుతోంది.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు
- భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో కాదు
- చట్టబద్ధంగా సాగుతోంది
- సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో నడవడం లేదని.. చట్టబద్ధమైన పాలనతోనే నిర్వహించబడుతుందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవాయ్ మారిషస్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘‘అతిపెద్ద ప్రజాస్వామ్యంలో చట్ట పాలన’’ అనే అంశంపై గవాయ్ ప్రసంగించారు. న్యాయమూర్తి ఒకేసారి జ్యూరీ, ఉరిశిక్షకుడిగా వ్యవహరించలేరని తెలిపారు. నిందితులను గుర్తించకముందే ఆస్తులను అక్రమంగా ధ్వంసం చేయడాన్ని తన తీర్పుతో నిరోధించినట్లు చెప్పారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్ నియమం ద్వారా కాకుండా చట్ట నియమం ద్వారా నిర్వహించబడుతుందని గవాయ్ సందేశాన్ని పంపించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో నిందితులను దోషులుగా నిర్ధారించకముందే వారి ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషన్లు కోరారు. దీంతో సుప్రీంకోర్టు పరిపాలనా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇదే విషయాన్ని గవాయ్ గుర్తు చేస్తూ.. కచ్చితమైన విధానాలు పాటించకుండా భవిష్యత్లో కూల్చివేతలు జరగకుండా చూసుకోవడానికి మార్గదర్శకాలను రూపొందించినట్లు గవాయ్ గుర్తుచేశారు. నిందితులను గుర్తించకముందే ఆస్తులను ధ్వంసం చేయకుండా తన తీర్పు ద్వారా కట్టడి చేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్కు ఇజ్రాయెల్ సూచన
‘‘ఏదైనా చట్టబద్ధం చేయబడినంత మాత్రాన అది న్యాయమైనదని అర్థం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. చరిత్ర ఈ బాధాకరమైన సత్యానికి అనేక ఉదాహరణలను అందిస్తుంది. ఉదాహరణకు బానిసత్వం ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో చట్టబద్ధమైనది. భారతదేశంలో 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం వంటి వలస చట్టాలు మొత్తం సమాజాలను, తెగలను పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రించాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని చట్టాలు స్థానిక ప్రజలను, అట్టడుగు వర్గాలను శిక్షించాయి. వ్యవస్థాగత అన్యాయాన్ని బలోపేతం చేశాయి. అణచివేత చట్ట వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రతిఘటనను అణిచివేసేందుకు దేశద్రోహ చట్టాలను తరచుగా ఉపయోగించేవారు.’’ అని గవాయ్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన ధరలు
తాజావార్తలు
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!