CJI Gavai: న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో కాదు.. చట్టబద్ధంగా సాగుతోంది.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు
- భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో కాదు
- చట్టబద్ధంగా సాగుతోంది
- సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో నడవడం లేదని.. చట్టబద్ధమైన పాలనతోనే నిర్వహించబడుతుందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవాయ్ మారిషస్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ‘‘అతిపెద్ద ప్రజాస్వామ్యంలో చట్ట పాలన’’ అనే అంశంపై గవాయ్ ప్రసంగించారు. న్యాయమూర్తి ఒకేసారి జ్యూరీ, ఉరిశిక్షకుడిగా వ్యవహరించలేరని తెలిపారు. నిందితులను గుర్తించకముందే ఆస్తులను అక్రమంగా ధ్వంసం చేయడాన్ని తన తీర్పుతో నిరోధించినట్లు చెప్పారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్ నియమం ద్వారా కాకుండా చట్ట నియమం ద్వారా నిర్వహించబడుతుందని గవాయ్ సందేశాన్ని పంపించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలతో నిందితులను దోషులుగా నిర్ధారించకముందే వారి ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషన్లు కోరారు. దీంతో సుప్రీంకోర్టు పరిపాలనా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇదే విషయాన్ని గవాయ్ గుర్తు చేస్తూ.. కచ్చితమైన విధానాలు పాటించకుండా భవిష్యత్లో కూల్చివేతలు జరగకుండా చూసుకోవడానికి మార్గదర్శకాలను రూపొందించినట్లు గవాయ్ గుర్తుచేశారు. నిందితులను గుర్తించకముందే ఆస్తులను ధ్వంసం చేయకుండా తన తీర్పు ద్వారా కట్టడి చేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్కు ఇజ్రాయెల్ సూచన
‘‘ఏదైనా చట్టబద్ధం చేయబడినంత మాత్రాన అది న్యాయమైనదని అర్థం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. చరిత్ర ఈ బాధాకరమైన సత్యానికి అనేక ఉదాహరణలను అందిస్తుంది. ఉదాహరణకు బానిసత్వం ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో చట్టబద్ధమైనది. భారతదేశంలో 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం వంటి వలస చట్టాలు మొత్తం సమాజాలను, తెగలను పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రించాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని చట్టాలు స్థానిక ప్రజలను, అట్టడుగు వర్గాలను శిక్షించాయి. వ్యవస్థాగత అన్యాయాన్ని బలోపేతం చేశాయి. అణచివేత చట్ట వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రతిఘటనను అణిచివేసేందుకు దేశద్రోహ చట్టాలను తరచుగా ఉపయోగించేవారు.’’ అని గవాయ్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన ధరలు
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!