Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
- రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం
- సోనమ్ బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
- మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనం రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. మూడు వారాల్లో సంబంధిత కోర్టు ముందు లొంగిపోవాలని సోనం రఘువంశీని ఆదేశించింది. అయితే, విచారణలో జాప్యం జరిగితే ఆరు నెలల తర్వాత కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ రద్దు కోరిన మేఘాలయ ప్రభుత్వం
సోనం రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న షిల్లాంగ్ కోర్టు ఆమెకు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
విచారణలో ఏమి జరిగింది?
సోనం రఘువంశీ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో మొత్తం 94 మంది సాక్షులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు నాలుగురి సాక్షుల వాంగ్మూలాలు మాత్రమే నమోదు అయ్యాయని, అదనపు చార్జ్షీట్ కూడా దాఖలైందని చెప్పారు. అలాగే సోనం పరారీలో లేదని, ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అరెస్టు అయ్యిందని, దానిని లొంగిపోవడంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాదించారు. బెయిల్ షరతులను ఆమె పూర్తిగా పాటిస్తోందని, పరారయ్యే అవకాశం లేదని కూడా తెలిపారు.
మేఘాలయ ప్రభుత్వ వాదన
మేఘాలయ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చార్జ్షీట్లో నమోదైన వివరాల ప్రకారం సోనం స్వయంగా లొంగిపోయిందని పేర్కొన్నారు. చట్టంలోని సెక్షన్కు సంబంధించిన ఒక చిన్న టైపింగ్ పొరపాటును ఆధారంగా తీసుకుని బెయిల్ ఇవ్వడం సరైంది కాదని వాదించారు. అలాగే బెయిల్ కొనసాగితే సోనం పరారయ్యే అవకాశం ఉందని కూడా ఆయన కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సమాజంలో వస్తున్న మార్పులపై కూడా వ్యాఖ్యానించింది. “సమాజంలో మార్పులు సహజం. నేటి తరం మా తరం కంటే ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో వారు మరింత సున్నితంగా ఉంటున్నారు.” అని కోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, “వారి వద్ద సమాచారం ఎక్కువగా ఉంది, కానీ జ్ఞానం కాదు” అని వ్యాఖ్యానించారు. దానికి జస్టిస్ వరాలే స్పందిస్తూ, “వాట్సాప్లో వచ్చే ప్రతి విషయాన్నీ జ్ఞానంగా భావించే పరిస్థితి ఏర్పడింది” అని వ్యాఖ్యానించారు.
రాజా రఘువంశీ హత్య కేసు ఏమిటి?
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ వివాహం అనంతరం తన భార్య సోనం రఘువంశీతో కలిసి 2025 మే 21న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లారు. మే 26న ఈ దంపతులు కనిపించకుండా పోవడంతో పోలీసులు, స్థానికులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అనంతరం జూన్ 2న, సోహ్రా సమీపంలోని ప్రసిద్ధ వెయి సావ్డాంగ్ జలపాతం సమీపంలో ఉన్న లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది.
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు
పోలీసుల దర్యాప్తు ప్రకారం, సోనం రఘువంశీకి రాజ్ కుష్వాహాతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజాను హత్య చేసేందుకు ఇద్దరూ కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు. హనీమూన్ను నెపంగా ఉపయోగించి, ముందుగా ప్రణాళిక ప్రకారం రాజాను హత్య చేయించారని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం, ఆకాశ్ సింగ్ రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి అనే ముగ్గురు వ్యక్తులు సోనం సమక్షంలో రాజాను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!