రేపు సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడనుంది… భారత్లో మాత్రం పాక్షికంగా ఉండబోతోంది.. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుండగా… భారత్లో కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితం కానుంది… పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, ఒడిషా తీర ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులలో కనిపిస్తుందని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్లో మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉండనుండగా.. కోల్కతాలో ఇలాంటి చంద్ర గ్రహణాన్ని దాదాపు పదేళ్ల కిందట 2011 డిసెంబరు 10న కనువిందుచేసింది. అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు 14 నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనమివ్వనుంది. ఇక, యూఎస్ కాలమానం ప్రకారం ఉదయం 4:47:39 గంటలకు ప్రారంభమై 57 నిమిషాల తర్వాత 5.44 గంటలకు పాక్షికస్థాయికి చేరుతుంది.. 7:11:25 గంటలకు పూర్తిస్థాయికి చేరుకుంటుంది. తర్వాత క్రమంగా గ్రహణం వీడుతూ 10:52:22 గంటలకు పూర్తవుతుంది.