Sunetra Pawar: ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా సునేత్రా పవార్ ఏకగ్రీవం..
- ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా సునేత్రా పవార్ ఏకగ్రీవం..
- మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunetra Pawar: నేషనలిస్ట్ కాంగ్రెరస్ పార్టీ(ఎన్సీపీ) శాసనసభా పక్ష నేతగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను ఏరకగ్రీంగా ఎన్నుకున్నారు. అజిత్ పవార్ మరణించిన మూడు రోజులకే ఆమెకు ఈ కీలక బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్రా పవార్కు, శనివారం జరిగిన కీలక సమావేశంలో ఈ పదవిని కట్టబెట్టారు. ఈ సమావేశం ముంబైలోని విధాన్ భవన్ సముదాయంలోని అజిత్ పవార్ కార్యాలయంలో జరిగింది. ఆమె పేరును ఎన్సీపీ సీనియర్ నేత దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, మంత్రి ఛగన్ బుజ్బల్ మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో అజిత్ పవార్ చిత్రపటానికి పూలమాల వేసి సునేత్ర నివాళులర్పించారు. ఈ సమావేశానికి అజిత్ పవార్ చిన్న కుమారుడు జై పవార్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
Read Also: Balochistan: బలూచిస్తాన్లో విరుచుకుపడిన BLA.. 10 మంది పాక్ అధికారులు మృతి..
Also Read
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
మూడు రోజుల క్రితం బారామతిలో ఒక కార్యక్రమానికి వెళ్తున్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు మొత్తం ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇదిలా ఉంటే, ఈ రోజు సాయంత్రం సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2024 లోక్సభ ఎన్నికల సమయంలో సునేత్రా పవార్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. బారామతి నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీలో నిలబడ్డారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఎన్సీపీ బాధ్యతలు సునేత్రా తీసుకోవాల్సి వస్తోంది. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీ స్థిరత్వం, నిరంతర నాయకత్వం కల్పించాలనే ఉద్దేశంతో సునేత్రా పవార్కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!