Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటలో ఏపీకి చెందిన బాలిక మృతి.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు..
- బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఏపీ బాలిక మృతి..
- అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి గ్రామం..
- యర్రగట్టవాండ్లపల్లెకు చెందిన బి.దివ్యాంశి (14) బాలిక..
- నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Stampede: ఐపీఎల్-25 లో ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీమ్కు నిర్వహించిన సన్మాన కార్యక్రమం.. తీవ్ర విషాదాన్ని నింపిన విషయం విదితమే.. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏకంగా 11 మంది మృతిచెందగా.. ఇంకా చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనలో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి గ్రామం యర్రగట్టవాండ్లపల్లెకు చెందిన బి.దివ్యాంశి (14) అనే బాలిక మృత్యువాత పడ్డారు. యర్రగట్టవాండ్లపల్లె చెందిన శివకుమార్ బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. భార్య అశ్విని, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా స్టేడియం వద్దకు శివకుమార్ భార్య అశ్విని తన కుమార్తెలు దివ్యాంశి, రచనను వెంట తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో స్టేడియం గేట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో దివ్యాంశి ఊపిరాడక మృతి చెందింది. బాలిక దివ్యాంశి మృతితో స్వగ్రామంలో విషాదం నెలకొంది. నేడు స్వగ్రామంలో దివ్యాంశి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!