Split in BKU: రెండుగా చీలిన బీకేయూ.. కొత్త యూనియన్ ఆవిర్భావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసి.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)లో చీలిక వచ్చింది. ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన రాకేష్ టికాయత్ వైఖరి నచ్చని రైతు నాయకులు కొత్త సంఘం పెట్టుకున్నారు. రాజేష్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ అరాజనీతిక్ పేరుతో కొత్త సంఘంగా ఆవిర్భవించింది. రాజకీయాలకు వ్యతిరేకంగా రైతు సంక్షేమం కోసం పోరాటం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు రాజేష్ సింగ్ చౌహాన్. ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రముఖ నేతలుగా ఎదిగిన రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ సోదరుల వ్యవహారం తమకు నచ్చలేదన్నారు.
Read Also: CBI Raids: చిదంబరం ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ సోదాలు
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇక, రాజేష్ సింగ్ చౌహాన్ కొత్త యూనియన్ ప్రకటించిన వెంటనే… చౌహాన్ సహా ఏడుగురిని BKU నుంచి బహిష్కరిస్తున్నట్టు రాకేష్ టికాయత్ ట్వీట్ చేశారు. వారు రైతు వ్యతిరేకులని ఆరోపించారు. అయితే, యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్ర సింగ్ టికాయిత్ వర్ధంతి రోజునే బీకేయూ చీలిపోవడం చర్చగా మారింది.. ఇక, రైతు సంఘాల చీలిక వెనుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు రాకేష్ టికాయిత్. ఏదేమైనా.. తమ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలనే వెనక్కి తీసుకునేలా చేసిన బీకేయూ.. ఇలా చీలిపోవడం.. పోరాట స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నేతలు.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!