Congress: ముంబైని “యూటీ” చేయాలనుకుంటుంది.. అందుకే పార్లమెంట్ సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘కేంద్రపాలిత ప్రాంతం’ చేయాలనుకుంటోందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎజెండా ఇదేనని మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సోమవారం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ మహమ్మారి, నోట్ల రద్దు, మణిపూర్ అంశాలపై ఎప్పుడూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయలేదని, కానీ ప్రస్తుతం రాబోతున్న సమావేశాల్లో ముంబైని యూటీ ప్రాంతంగా ప్రకటించి మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల నుంచి విడదీస్తుందని ఆరోపించారు.
Read Also: Karnataka: దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి..
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ముంబై ఒక అంతర్జాతీయ నగరం, ఆర్థిక రాజధాని అని.. ఇప్పుడు ముంబైలోని ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, డైమండ్ మార్కెట్ వంటి వాటిని నగరం నుంచి తరలించేస్తున్నారని పటోలే ఆరోపించారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లను గుజరాత్కి మార్చే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో శివసేస-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలకు అడ్డంకిగా ఉందనే కేంద్రంలోని బీజేపీ అధికారంలోంచి దించేసిందని ఆయన అన్నారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. అయితే సమావేశాల ఎజెండా ఇంతవరకు కేంద్రం స్పష్టం చేయలేదు. అయితే ఇండియా-భారత్ పేరు మార్పు, వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి అంశాలు చర్చకు వస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 19 తేదీన కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!