సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. అధికార బిజేపి ని దీటుగా ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యపక్షం
గా ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ ( డి.ఎమ్.కె), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాకరే (శివసేన), ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ( జార్ఖండ్ ముక్తి మోర్చా) తో పాటుగా శివసేన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పాల్గొంది.
Also Read
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
అయితే ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను సోనియా గాంధీ ఆహ్వనించగా ఆప్, ఎస్.పి, బి.ఎస్.పి హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవల అసమ్మతి గళాన్ని వినిపించిన కపిల్ సిబల్ గత వారం ఏర్పాటు చేసిన “డిన్నర్ సమావేశం” తర్వాత, ఈ రోజు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి అత్యంత ప్రధాన్యత ఇచ్చారు. కపిల్ సిబల్ “డిన్నర్ సమావేశం” కు సమాజవాది పార్టీ, అకాలీదళ్ తో సహా మొత్తం 15 ప్రతిపక్ష పార్టీ లకు చెందిన 45 మంది నేతలు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రకిపక్షాల ఉమ్మడి పోరు, ఐక్యత బలంగా కోరుకుంటున్నప్పటికీ, గాంధీ కుటుంబ నాయకత్వం పట్ల వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నేతలు.
అయుతే, ప్రతిపక్షాల ఐక్యత కోసం, ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన రాహుల్ గాంధీ… పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, ఉదయం ప్రతిపక్షాల నేతలతో అల్పాహార సమావేశాన్ని స్వయంగా నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షాల సమావేశాలలో పలుమార్లు పాల్గొన్నారు రాహుల్ గాంధీ. పలు నిరసన ప్రదర్శనలో కూడా చురుగ్గా పాల్గొన్నారు రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనకు మద్దతుగా ట్రాక్టర్ పై, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరై, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, ప్రతిపక్షాల ఐక్యత పటిష్టంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు పలు ప్రతిపక్షాలు.
తాజావార్తలు
-
BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS
-
Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
-
Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
-
Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?