సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. అధికార బిజేపి ని దీటుగా ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యపక్షం
గా ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ ( డి.ఎమ్.కె), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాకరే (శివసేన), ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ( జార్ఖండ్ ముక్తి మోర్చా) తో పాటుగా శివసేన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పాల్గొంది.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
అయితే ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను సోనియా గాంధీ ఆహ్వనించగా ఆప్, ఎస్.పి, బి.ఎస్.పి హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవల అసమ్మతి గళాన్ని వినిపించిన కపిల్ సిబల్ గత వారం ఏర్పాటు చేసిన “డిన్నర్ సమావేశం” తర్వాత, ఈ రోజు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి అత్యంత ప్రధాన్యత ఇచ్చారు. కపిల్ సిబల్ “డిన్నర్ సమావేశం” కు సమాజవాది పార్టీ, అకాలీదళ్ తో సహా మొత్తం 15 ప్రతిపక్ష పార్టీ లకు చెందిన 45 మంది నేతలు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రకిపక్షాల ఉమ్మడి పోరు, ఐక్యత బలంగా కోరుకుంటున్నప్పటికీ, గాంధీ కుటుంబ నాయకత్వం పట్ల వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నేతలు.
అయుతే, ప్రతిపక్షాల ఐక్యత కోసం, ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన రాహుల్ గాంధీ… పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, ఉదయం ప్రతిపక్షాల నేతలతో అల్పాహార సమావేశాన్ని స్వయంగా నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షాల సమావేశాలలో పలుమార్లు పాల్గొన్నారు రాహుల్ గాంధీ. పలు నిరసన ప్రదర్శనలో కూడా చురుగ్గా పాల్గొన్నారు రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనకు మద్దతుగా ట్రాక్టర్ పై, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరై, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, ప్రతిపక్షాల ఐక్యత పటిష్టంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు పలు ప్రతిపక్షాలు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!