సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. అధికార బిజేపి ని దీటుగా ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతున్నారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యపక్షం
గా ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ ( డి.ఎమ్.కె), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాకరే (శివసేన), ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ( జార్ఖండ్ ముక్తి మోర్చా) తో పాటుగా శివసేన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పాల్గొంది.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
అయితే ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను సోనియా గాంధీ ఆహ్వనించగా ఆప్, ఎస్.పి, బి.ఎస్.పి హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవల అసమ్మతి గళాన్ని వినిపించిన కపిల్ సిబల్ గత వారం ఏర్పాటు చేసిన “డిన్నర్ సమావేశం” తర్వాత, ఈ రోజు సోనియా గాంధీ నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి అత్యంత ప్రధాన్యత ఇచ్చారు. కపిల్ సిబల్ “డిన్నర్ సమావేశం” కు సమాజవాది పార్టీ, అకాలీదళ్ తో సహా మొత్తం 15 ప్రతిపక్ష పార్టీ లకు చెందిన 45 మంది నేతలు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రకిపక్షాల ఉమ్మడి పోరు, ఐక్యత బలంగా కోరుకుంటున్నప్పటికీ, గాంధీ కుటుంబ నాయకత్వం పట్ల వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నేతలు.
అయుతే, ప్రతిపక్షాల ఐక్యత కోసం, ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన రాహుల్ గాంధీ… పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, ఉదయం ప్రతిపక్షాల నేతలతో అల్పాహార సమావేశాన్ని స్వయంగా నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షాల సమావేశాలలో పలుమార్లు పాల్గొన్నారు రాహుల్ గాంధీ. పలు నిరసన ప్రదర్శనలో కూడా చురుగ్గా పాల్గొన్నారు రాహుల్ గాంధీ. రైతుల ఆందోళనకు మద్దతుగా ట్రాక్టర్ పై, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరై, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, ప్రతిపక్షాల ఐక్యత పటిష్టంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు పలు ప్రతిపక్షాలు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..