Mahakumbh Mela: సీఎం యోగితో ఇటలీ బృందం భేటీ.. ఎంత చక్కగా “రామభజన” పాడారో చూడండి..
- ఇటలీ బృందంతో సమావేశమైన యోగి ఆదిత్యనాథ్..
- యోగి ముందు ‘‘రామ భజన’’ ఆలపించిన ఇటలీ మహిళలు..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahakumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళకి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నారు. కుంభమేళ ముగిసే నాటికి ఏకంగా 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి వస్తారని అంచనా. ఇటీవల ఇటలీకి చెందిన ఒక ప్రతినిధి బృందం కుంభమేళలో ‘‘కాలభైరవాష్టకమ్’’ పాడటం వైరల్గా మారింది. హిందూ ధర్మంపై వారికి ఉన్న భక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది.
Read Also: Rahul Gandhi: ‘‘భారత్ రాజ్యం’’పై నోరుజారిన రాహుల్ గాంధీ.. మరో కేసు నమోదు..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
తాజాగా, ఇదే ఇటలీ బృందం సీఎం యోగి ఆదిత్యనాథ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు ఆలపించిన ‘‘రామ్ భజన’’ వీడియో వైరల్గా మారింది. ఇటలీలోని మెడిటేషన్ మరియు యోగా కేంద్రం వ్యవస్థాపకుడు , శిక్షకుడు మహి గురూజీ తన అనుచరులతో కలిసి ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రయాగ్ రాజ్కి ఇటలీ నుంచి వచ్చిన మహిళలు సీఎం ముుందు రామాయణం, శివతాండవం, ఇతర అనేక భజనలను పారాయణం చేశారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభ మేళ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం, జనవరి 18 వరకు త్రివేణి సంగమ ప్రదేశంలో 7.72 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరో 4 ముఖ్యమైన పవిత్ర స్నానాలు ఉన్నాయి, ఇవి జరిగే రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తదుపరి ముఖ్యమైన స్నాన తేదీలలో జనవరి 29 (మౌని అమావాస్య – రెండవ షాహి స్నాన్), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి – మూడవ షాహి స్నాన్), ఫిబ్రవరి 12 (మాఘి పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) రోజున ఉన్నాయి.
#WATCH लखनऊ: इटली से आए एक प्रतिनिधिमंडल ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ से मुलाकात की।
प्रयागराज महाकुंभ से लौटी महिलाओं ने मुख्यमंत्री के सामने रामायण, शिव तांडव और कई भजनों का पाठ किया। pic.twitter.com/nsQhvx2n2y
— ANI_HindiNews (@AHindinews) January 19, 2025
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!