PM Narendra Modi: బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ.. ప్రతిపక్షాలపై మోదీ విమర్శలు..
PM Narendra Modi: బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ సంస్థ నుంచి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగేందుకు పార్టీ కార్యకర్తల అంకితభావం, త్యాగాలే కారణం అని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణలో ఉన్న పలు రాజకీయ పార్టీ మధ్య బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని అభివర్ణించారు. బీజేపీ అత్యంత భవిష్యత్ వాద పార్టీగా అవతరించిందని ఆయన అన్నారు.
బీజేపీ కేవలం రెండు లోక్ సభ స్థానాల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి 2019లో 303 స్థానాలకు చేరుకుందని, చాలా రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర వరకు బీజేపీ మాత్రమే ఉందని ఆయన అన్నారు. ఆధునిక, అభివృద్ధి చెందిన భారతదేశమే తమ లక్ష్యం అని ప్రధాని వెల్లడించారు. మనకు రాజ్యాంగ సంస్థలు బలమైన పునాదిగా ఉన్నాయని, అందుకే భారత్ ను అడ్డుకునేందుకు రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నారు. కేంద్ర ఏజెన్సీలు చర్యలు తీసుకుంటే దాడులు జరుగుతున్నాయని, కోర్టులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
Read Also: Strange Incident : ఒకే కాన్పులో నలుగురు.. ఎక్కడో కాదు మన దగ్గరే
బీజేపీ తెరపైనో, వార్తా పత్రికల్లోనో, ట్విట్టర్ హ్యాండిల్స్, యూట్యూబ్ ఛానెళ్ల నుంచి వచ్చిన పార్టీ కాదని, బీజేపీ కార్యకర్తలతో పురోగమించిందని ప్రధాని అన్నారు. ఏడు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా అవినీతిపరులపై చర్యలు తీసుకుంటుంటే కొంతమంది కలత చెందుతున్నారని, కోపంతో ఉన్నారని వారి తప్పుడు ఆరోపణలపై చర్యలు ఆగవని ప్రతిపక్షాలకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు ప్రధాని.
అవినీతిలో కూరుకుపోయిన వారంతా ఒకే వేదికపైకి వస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. అవినీతిపరుల మూలాలను కదిలించాం. మనీలాండరింగ్ చట్టం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 వేల కోట్లను జప్తు చేసిందని, బీజేపీ హాయాంలో దాదాపుగా 10,00,000 కోట్లు పట్టుబడ్డాయని, ఇరవై వేల మంది ఆర్థిక నేరస్థులు పట్టుబడ్డారని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!