Millionaire migrations: ఇండియాను వదులుతున్న మిలియనీర్లు.. ఏ దేశాలకు వెళ్తున్నారంటే..?
- ఇండియాను వదిలేస్తున్న మిలియనీర్లు..
- యూఏఈ-అమెరికాకు వలస..
- నాణ్యమైన జీవితం
- వ్యాపార ప్రయోజనాలకే పాధాన్యత..
- హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millionaire migrations: మిలియనీర్లు భారత్ నుంచి వలస బాట పడుతున్నారు. ఈ ఏడాది దాదాపుగా 4300 మంది మిలియనీర్లు భారత దేశాన్ని విడిచిపెడతారని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడి వలసల సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇటీవల విడుదల చేసిన నివేదికల ఈ విషయాలను పేర్కొంది. గతేడాది ఇదే నివేదిక 5100 మంది భారత మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చినట్లు చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. చైనా, యూకే తర్వాత మిలియనీర్ల వలసల్లో మూడో స్థానంలో ఉంది.
భారత్ నుంచి ఇలా వలసవెళ్లే వారు తమ గమ్యస్థానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని ఎంచుకుుంటున్నారు. భారత్ వేలాది మిలియనీర్లను కోల్పోతుండగా, అనేక మంది యూఏఈకి వెళ్తున్నారు. అయితే, భారత్ మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ 85 శాతం వృద్ధితో దేశంలో కొత్త మిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. దీంతో వలసలపై ఆందోళన తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇలా వెళ్తున్న ధనవంతులు భారత్ని తమ రెండో ఇళ్లుగా భావిస్తూనే, భారతదేశంలో వ్యాపార ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు, ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాన్ని సూచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
Also Read
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
Read Also: Jammu Kashmir: బారాముల్లా ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
భారత ప్రైవేట్ బ్యాంకులు, సంపద నిర్వహణ ప్లాట్ఫారమ్స్ తమ క్లయింట్స్కి పెట్టుబడి సలహా సేవల్ని అందించేందుకు యూఏఈకి విస్తరిస్తున్నాయి. ఇదే విధంగా ఇతర బ్యాంకులు కూడా యూఏఈలో తమ ఉనికిని బలపరుస్తున్నాయి. భారతీయ కుటుంబాలకు కాంపిటేటివ్ వెల్త్ మేనేజ్మెంట్ సేవల్ని అందిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 1,28,000 మంది మిలియనీర్లు 2024లో ఇలా వలస వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. యూఏఈతో పాటు అమెరికా వీరి ప్రాధాన్య గమ్యస్థానాలుగా అగ్రస్థానంలో ఉన్నాయి. వలస వచ్చిన మిలియనీర్లు వారితో పాటు గణనీయమైన ఆస్తులను తరలించడం ద్వారా విదేశీ మారక నిల్వలకు దోహదం చేస్తారు. వారి పెట్టుబడుల ద్వారా ఈక్విటీ ప్లేస్మెంట్ల ద్వారా స్థానిక స్టాక్ మార్కెట్లను కూడా ఉత్తేజపరుస్తాయి. ఇదే కాకుండా మిలియనీర్లచే స్థాపించబడే కంపెనీలు, సంస్థలు అధిక చెల్లింపు ఉద్యోగాలను సృష్టిస్తాయి. మధ్య తరగతికి ప్రయోజనం చేకూరుస్తాయి.
ఒక మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ లిక్విడ్ ఇన్వెస్ట్ చేయదగిన ఆస్తులను కలిగిన వ్యక్తిని మిలియనీర్గా అభివర్ణిస్తారు. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మరియు మొత్తం జీవన ప్రమాణాలతో సహా వివిధ కారణాల వల్ల ధనవంతులు ఇలా వలస వెళ్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
-
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!