ఉత్తరాఖండ్ మంచుతో కప్పబడి ఉంది. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్ బద్రినాథ్, జోషిమఠ్, చమోలీ జిల్లాలలో ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తోంది. బద్రీనాథ్ ఆలయం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చలితీవ్రత తీవ్రంగా ఉంది. బద్రీనాథ్లో రాత్రిపూట మంచు కురిసిన తర్వాత ఆయా ప్రాంతాలు, నివాస గృహాలు, చెట్లు తీవ్రమయిన మంచుతో కప్పబడి ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని జోషిమత్లోని ఎత్తైన పర్వత శ్రేణులపై మంచు కురుస్తోంది. ఈ వాతావరణం స్థానికులకు ఆరోగ్యపరంగా ఇబ్బందుల్ని కలుగచేస్తుంటే.. పర్యాటకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.
Read Also: Basmati Rice: బాస్మతి రైస్ కు నాణ్యతా ప్రమాణాలు.. ఆగస్ట్ 1 నుంచి అమలు
హిమపాతం కొండలను సందర్శించే దాదాపు ప్రతి పర్యాటకునికి ఆనందాన్ని కలిగిస్తుంది. హిల్స్టేషన్లలో మంచు కురుస్తుంది. ప్రసిద్ధ హిమాలయ శ్రేణి, కాంగ్రా లోయకు ఎదురుగా ఉన్న ధౌలాధర్, సీజన్లో తాజా హిమపాతం తర్వాత ఒక సహజమైన తెల్లటి కవచాన్ని కప్పేసి ఉంది. ఈ శీతల వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. హిమాలయ రేంజర్లోని అనేక ప్రాంతాలను హిమపాతం ముంచెత్తింది. జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ హిమపాతం కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. సిమ్లాలో 200కు పైగా రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. జాతీయ రహదారిని కూడా మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా శుక్రవారం విమాన కార్యకలాపాలను నిలిపివేసింది.
ఈరోజు మంచు కురుస్తుండటంతో మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో హెలికాప్టర్, బ్యాటరీ కార్ సేవలు కూడా నిలిపివేశారు. ఉత్తర భారత మైదానాలు శనివారం నుండి తీవ్రమయిన శీతల వాతావరణానికి గురవుతాయని అంచనా వేశారు. ఇది జనవరి 16 మరియు 18 మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ధౌలాధర్ శ్రేణి హిమాలయ పర్వతాల శ్రేణిలో ఒక భాగం. ధౌలాధర్ శ్రేణిని ఔటర్ హిమాలయాస్ అంటారు. అవి హిమాచల్ ప్రదేశ్ యొక్క వాయువ్య చివరన ఉన్న డల్హౌసీ దగ్గర నుండి ప్రారంభమవుతాయి. ఇవి హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో బియాస్ నది ఒడ్డుకు చేరుకుంటాయి. అవి గర్వాల్లోని బద్రీనాథ్ దగ్గర ముగుస్తుండగా, అవి దాదాపు పూర్తిగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అవి వాటి విలక్షణమైన డార్క్ గ్రానైట్ రాతి నిర్మాణాలలో విలక్షణమైనవి, వాటి శిఖరాగ్ర శిఖరాల పైభాగంలో మంచు కురుస్తుంది. జోషిమఠ్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
Read Also: Team India: న్యూజిలాండ్తో టీ20 సిరీస్.. రోహిత్, కోహ్లీలను దూరం పెట్టిన బీసీసీఐ