Basmati Rice: బాస్మతి రైస్ కు నాణ్యతా ప్రమాణాలు.. ఆగస్ట్ 1 నుంచి అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీకు మంచి ఆకలి వేస్తోంది. ఏంచేస్తారు హాయిగా బిర్యానీ ఆర్డర్ చేస్తారు. ఆ బిర్యానీలో వాడే బాస్మతి బియ్యం గురించి మీకు తెలుసా? ఏ బియ్యం అంటే ఆ బియ్యం వాడితే బిర్యానీ రుచిగా ఉండదు. బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది కేంద్రం. బాస్మతి బియ్యంతో వండే బిర్యానీ ఎంతో బాగుంటుంది. దేశంలో వివిధ రకాల బాస్మతి బియ్యం అందుబాటులో వున్నాయి. వివిధ కంపెనీలు, వివిధ రేట్లలో అమ్ముతారు. కల్తీలు, నాసిరకం బాస్మతి బియ్యంపై దృష్టి సారించింది కేంద్రం. బియ్యం పొడవు, ఈ బియ్యం నుంచి వచ్చే పరిమళం వంటి అంశాలతో నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది.
Read Also: Balakrishna: నారావారిపల్లెలో ఉదయాన్నే జాగింగ్ చేసిన బాలయ్య
Also Read
హైదరాబాద్ లో బిర్యానీ రైస్ ఫ్యామస్. మంచి బిర్యానీ వండాలంటే బాస్మతి బియ్యం వెతికి తేవాల్సిందే. బిర్యానీకి బాస్మతి బియ్యంతో మరింత రుచి వస్తుందని అందరికీ తెలిసిందే. బాస్మతి బియ్యంలో ఈమధ్య కాలంలో బాగా కల్తీ జరుగుతోంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రమాణాలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులకు మంచి బాస్మతీ బియ్యం అందించేందుకు వీలుగా ఈ నియంత్రణ ప్రమాణాలు రూపొందించినట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ ప్రమాణాలు దేశీయ మార్కెట్లకు, విదేశీ ఎగుమతులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఒరిజినల్ బాస్మతి రకాలుగా బ్రౌన్ బాస్మతి బియ్యం, మర పట్టించిన బాస్మతీ బియ్యం, మర పట్టించిన పారాబాయిల్డ్ బియ్యంను నోటిఫికేషన్లో వెల్లడించింది.
బాస్మతీ బియ్యానికి ఎలాంటి కృత్రిమ రంగులు, పాలిష్ పట్టినట్టు కనిపించేందుకు వాడే రసాయనాలు, కృత్రిమ పరిమళాలు వినియోగించరాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. దీంతో పాటు మరికొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. బాస్మతి బియ్యపు గింజ 7 మిమీ కంటే పొడవు ఉండాలని, వండిన తర్వాత అది సగటున 12 మిమీకి పెరగాలని పేర్కొంది. మర పట్టించిన బాస్మతీ బియ్యపు గింజ పొడవు 6.61 మిమీ ఉండాలని, ఉడికించిన తర్వాత 12 మిమీ కంటే పొడవు పెరగాలని నిర్దేశించింది. అంతేకాదు, బాస్మతి బియ్యంలో తేమ, అమైలోజ్, యూరిక్ యాసిడ్ శాతం, సగం విరిగిపోయిన బియ్యం, నాన్ బాస్మతీ రకాలు తదితర అంశాలను కూడా తాజా ప్రమాణాల్లో పొందుపరిచింది. కేంద్రం తీసుకువచ్చిన ప్రమాణాల ప్రకారం ఇకనుంచి విక్రయాలు జరపాల్సి వుంది. మరి వ్యాపారులు ఈ ప్రమాణాలు ఎలా పాటిస్తారో చూడాలి.
Read Also: Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?
తాజావార్తలు
-
Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?