Team India: న్యూజిలాండ్తో టీ20 సిరీస్.. రోహిత్, కోహ్లీలను దూరం పెట్టిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: శ్రీలంకతో వన్డే సిరీస్ పూర్తి కాగానే న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈనెల 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలను బీసీసీఐ మరోసారి దూరంపెట్టింది. ఈ మేరకు న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. వన్డే సిరీస్కు రోహిత్ సారథ్యం వహించనుండగా.. టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యానే జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ను బీసీసీఐ ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాల రీత్యా వీళ్లిద్దరూ అందుబాటులో ఉండరని అధికారులు తెలిపారు. అటు శ్రీలంకతో తొలి టీ20లో గాయపడ్డ సంజు శాంసన్ను కూడా సెలక్టర్లు పట్టించుకోలేదు.
మరోవైపు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఇటీవల రంజీల్లో అదరగొట్టిన పృథ్వీషాకు టీమిండియాలో చోటు దక్కింది. 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మకు కూడా అవకాశం లభించింది. అయితే రవీంద్ర జడేజా ఫిట్గా లేకపోవడం వల్ల అతడిని తీసుకోలేదని బీసీసీఐ వివరించింది. అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ నెలాఖరులో కేఎల్ రాహుల్ తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకోనున్న సందర్భంగా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదని సమాచారం.
Also Read
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
- Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
- Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
న్యూజిలాండ్తో సిరీస్కు భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్తో సిరీస్కు భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, పృథ్వీ షా, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్, సూర్యకుమార్ యాదవ్
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!