Smriti Irani: ప్రశ్నించే దమ్ములేనోడు అడ్డుతగులుతున్నాడు.. రాహుల్పై స్మృతి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani: పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్లో గళం వినిపించింది లేదని… ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదని ఆమె మండిపడ్డారు. ఎప్పుడూ పార్లమెంట్ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడని ఆరోపించారు. పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనేని. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడంటూ స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.
జీఎస్టీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇతర సమస్యలపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో నిరసనలు చేస్తుండగా.. స్మృతి ఇరానీ ప్రత్యేకంగా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వయనాడ్కు వెళ్లిన తర్వాత పార్లమెంట్లో ఎలాంటి ప్రశ్నలూ అడగలేదన్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఆయన హాజరు కేవలం 40 శాతం మాత్రమేనని ఆమె విమర్శించారు. రాహుల్ గాంధీ రాజకీయ చరిత్ర మొత్తం పార్లమెంటరీ విధానాన్ని, రాజ్యాంగబద్ధమైన విధానాలను అగౌరవపరచడంతోనే నిండిపోయిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను ముందుకు తీసుకురావడానికి పార్లమెంట్ ఒక ఉత్పాదక వేదిక అని మంత్రి వెల్లడించారు.
Also Read
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరేంటి ? ఎవరికీ మద్దతిస్తారు ?
మంగళవారం రాహుల్ గాంధీ ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెరుగుదలకు వ్యతిరేకంగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాల నిరసనలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఉభయ సభల్లో ప్రతిపక్షాల గందరగోళం ఏర్పడింది, అవి కొన్ని గంటల్లోనే వాయిదా పడ్డాయి. జులై 18న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.
తాజావార్తలు
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!