Madhya Pradesh: శివరాజ్‘రాజ్’సింగ్దే మధ్యప్రదేశ్.. మళ్లీ కమలానిదే హవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: సింగ్ ఈస్ కింగ్.. మరోసారి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివ”రాజ్”సింగ్ పాలనే కొనసాగుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే, ఇండియా టీవీ, రిపబ్లిక్ టీవీ వంటివి బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని సంస్థలు మాత్రం బీజేపీ కన్నా స్వల్పంగా కాంగ్రెస్ కొన్ని స్థానాలను సాధిస్తుందంటూ అంచనా వేస్తున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 47 శాతం ఓట్లతో అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. 41 శాతం ఓట్లను కాంగ్రెస్ తెచ్చుకుంటుందని తెలిపింది.
Read Also: Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 140-162 సీట్లలో అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. మరోవైపు కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్, నిమార్ ,బుందేల్ ఖండ్, చంబర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
క్లీన్ ఇమేజ్ ఉన్న బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. 36 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్నాథ్ కి 30 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఛర్మష్మా, శివరాజ్ సింగ్ చౌహాన్ అభివృద్ధి పనులు కారణమని పేర్కొంది. నవంబర్ 17న జరిగిన ఈ రాష్ట్ర ఎన్నికల్లో 77.15 శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!