Mumbai: కర్ణాటకలోని బెలగావిని యూటీ చేయండి.. మోడీకి ఆదిత్య థాక్రే విజ్ఞప్తి
- కర్ణాటకలోని బెలగావిని యూటీ చేయండి
- ప్రధాని మోడీకి ఆదిత్య థాక్రే విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీని కోరారు. బెలగావిలో మరాఠా మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మరాఠీలకు జరుగుతున్న అవమానాన్ని సహించలేపోతున్నామన్నారు. బెలగావిలో అధిక జనాభా మరాఠీ మాట్లాడే వారే ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆదిత్య కోరారు.
ఇది కూడా చదవండి: AP Cabinet: త్వరలో ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు!
Also Read
ఇక కర్ణాటక ప్రభుత్వం తీరుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే అసంతృప్తి వ్యక్తం చేశారు. బెలగావిలో నిరసనలు తెలుపుతున్న మరాఠీ కార్యకర్తలపై పోలీసుల్ని ప్రయోగించడాన్ని ఖండించారు. సరిహద్దులో మరాఠా మాట్లాడుతున్న ప్రజలపై కర్ణాటక ప్రభుత్వం అణచివేత వ్యూహాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అమిత్ షాతో గతంలో సమావేశం జరిగిందని గుర్తుచేశారు. సమావేశంలో సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. అయినా కూడా కర్ణాటక ప్రభుత్వం ఈ తరహాగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సోమవారం ఉదయం కర్ణాటకలోని సువర్ణ విధాన్ సౌధలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి కార్యకర్తలు, నేతలను ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
#WATCH | Mumbai: Shiv Sena (UBT) leader Aaditya Thackeray says, "Shiv Sena (UBT) boycotted today's proceedings because of two things. Firstly, we had unopposed the Speaker's election yesterday respecting the custom and tradition. But when the name that came up was of Rahul… pic.twitter.com/j0rnB9Iz3s
— ANI (@ANI) December 9, 2024
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!