Andhra Pradesh: టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
- టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
- సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లు ఖరారు చేసిన టీడీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీద మస్తాన్ రావు.. గత ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీ.. వైసీపీ నుంచి జంప్ చేసి 2024 రాష్ట్ర జనరల్ ఎలక్షన్ల సమయానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీద మస్తాన్ రావు ఒక వ్యాపారవేత్త.. అలాగే కచ్చితంగా తన రాజ్యసభ ఎంపీ స్థానం తనకే ఉంటుందనే హామీ తీసుకుని పార్టీ మారినట్లు తెలిసింది. బీద మస్తాన్ రావు 2009లో కావలి నుంచీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. అయితే క్రియాశీలక రాజకీయాలలో లేని బీద మస్తాన్ రావును 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు పంపించారు… 2024లో వైసీపీకి, రాజ్యసభకు కూడా బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు. అయితే టీడీపీ నుంచి బలమైన ప్రామిస్ ఇవ్వడంతో టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళడానికి బీదా మస్తాన్ రావు నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ కూడా రాజ్యసభకు ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే కాకనాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్న సానా సతీష్కు కూడా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
Read Also: Home Minister Anitha: డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్.. ఆ నెంబర్ నుంచే హోంమంత్రికి కూడా!
Also Read
- SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
- Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
ఆర్.కృష్ణయ్య తెలంగాణా నుంచీ వచ్చినా.. ఆయనను రాజ్యసభకు పంపించింది గత వైసీపీ ప్రభుత్వం … అయితే ఆర్.కృష్ణయ్య మొదటగా బీసీ నాయకుడు.. అలాగే రాజకీయాల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి 2014లో పోటీ చేసి గెలిచాడు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.. ఆ తరువాత వైసీపీ ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది.. 2024లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసారు.. అయితే బీసీ ఉద్యమ నాయకుడు కావడం.. బీజేపీకి బీసీలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారు. అలాగే బీజేపీ రాబోయే కాలంలో క్షేత్రస్ధాయిలో బలపడాలంటే సామాజికవర్గ సమీకరణాలను పూర్తిగా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దీనిలో బీసీలలో బీజేపీని చొప్పించడానికి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బీజేపీ కండువా కప్పారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఫైనల్ కావడంతో ఏపీ నుంచి ఆ ముగ్గురి నామినేషన్లు ఏకగ్రీవం కానున్నాయి.
తాజావార్తలు
-
Dark Secrets OTT: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్.. టాప్ 1 ట్రెండింగ్లో ‘డార్క్ సీక్రెట్స్’!
-
SL vs IND: 462 పరుగులకు భారత్ ఆలౌట్.. తొలి ఓవర్లోనే శ్రీలంకకు భారీ షాక్!
-
SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
-
Rainbow Children’s Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
-
West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
ట్రెండింగ్
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!