Maharashtra: ఇంకా తేలని మహారాష్ట్ర సీఎం.. హోం మినిస్ట్రీ పైనే శివసేన పంచాయతీ..
- మహారాష్ట్ర సీఎం పదవిపై వీడని సస్పెన్స్..
- సీఎంతో సహా హోంశాఖని కోరుతున్న బీజేపీ..
- తమకు హోం మినిస్ట్రీ ఇవ్వాలంటున్న శివసేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రి విషయంలో మహారాజకీయాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో రెండు రోజుల క్రితం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. దీని తర్వాత ఏదైనా ప్రకటన వస్తుందని ఊహించినప్పటికీ అలాటిదేం జరగలేదు. ఏక్నాథ్ షిండే సీఎం పదవి గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్కి సీఎం పోస్ట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
Read Also: Real Estate: హైదరాబాద్లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
ఇదిలా ఉంటే, బీజేపీ సీఎం పోస్టుతో పాటు హోం మినిస్ట్రీ కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు ఇదే బీజేపీ-శివసేన మధ్య పంచాయతీకి దారి తీసింది. శివసేన నేత సంజయ్ శిర్సత్, కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ హోంశాఖ కావాలని కోరాడు. “హోం శాఖ పార్టీ (శివసేన) వద్ద ఉండాలి. ఈ శాఖకు సాధారణంగా ఉప ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, అయితే ముఖ్యమంత్రి దానిని కూడా నిర్వహించడం సరికాదు” అని ఔరంగాబాద్ పశ్చిమ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శిర్సత్ అన్నారు. మరాఠా కోటా ఉద్యమాన్ని షిండే పరిష్కరించాలని ఆయన చెప్పారు. లడ్కీ బహిన్ పథకాన్ని, ఇతర సంక్షేమ చర్యల్ని ఆయన హైలెట్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 సీట్లని మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 57 స్థానాలను శివసేన గెలుచుకుంది, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!