BMW hit-and-run case: శివసేన నుంచి ‘హిట్ అండ్ రన్’ నిందితుడి తండ్రి సస్పెండ్..
- ముంబై కార్ యాక్సిడెంట్ కేసు..
- నిందితుడి తండ్రిపై శివసేన వేటు..
- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సీఎం షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW hit-and-run case: ముంబైలో బీఎండబ్ల్యూ కార్ యాక్సిడెంట్ కేసు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన పార్టీ నాయకుడు కుమారుడే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు. ఆదివారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో కారుని వేగంగా నడుపుతూ స్కూటర్పై వస్తున్న భార్యభర్తల్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో 45 ఏళ్ల మహిళ మరణించింది. నిందితుడైన మిహిర్ షా, పాల్ఘర్ జిల్లా శివసేన ప్రధాన నాయకుడైన రాజేష్ షా కుమారుడు. ఘటన జరిగిన సమయంలో కారులోనే మిహిర్ షాతో పాటు అతని డ్రైవర్ ఉన్నట్లుగా తేలింది.
Read Also: Kenza Layli : తొలి మిస్ ఏఐ కిరీటాన్ని కైవసం చేసుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
ఈ నేపథ్యంలోనే శివసేన నుంచి రాజేష్ షాని సస్పెండ్ చేశారు. అతని సస్పెన్షన్ని సీఎం షిండే ఆమోదించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడు మిహిర్ షా పరారయ్యాడు. 72 గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రాజేష్ షాని ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్పై విడుదల చేశారు. మిహిర్ షా తప్పించుకోవడానికి రాజేష్ షా మరియు బిదావత్ సహాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు మద్యం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మిహిర్ షా మరియు అతని నలుగురు స్నేహితులు జుహులోని వైస్-గ్లోబల్ తపస్ బార్లో ఉన్న కొన్ని గంటల తర్వాత ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
ముంబైలో కనీన మద్యపాన వయసు 25 ఏళ్లు, కాగా నిందితుడి మిహిర్ షాకు 24 ఏళ్లు. మద్యం అందించిన బార్ షాపుని ముంబై పురపాలక అధికారులు కూల్చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను కావేరీ నఖ్వాగా గుర్తించారు. ఆమె భర్త ప్రదీప్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ దారుణమైన ఘటనక పాల్పడిన మిహిర్ షాను ఉరితీయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!