Sheikh Hasina: బంగ్లాలో హింస సర్వ సాధారణంగా మారింది.. షేక్ హసీనా ఆవేదన
- బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ప్రధాని
- హింస సర్వ సాధారణంగా మారిందన్న షేక్ హసీనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. షేక్ హసీనా కాలంలో జరిగిన ఉద్రిక్తతల కంటే ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయి. హిందువులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలో తిరిగి ల్యాండ్
Also Read
ఇక తాజా పరిణామాలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. బంగ్లాదేశ్లో హింస సర్వసాధారణంగా మారిపోయిందని వాపోయారు. గతేడాది దేశంలో జరిగిన మారణహోమాన్ని ఆపడానికే దేశం వీడిచి భారత్కు వచ్చానన్నారు. అంతే తప్ప భయపడి రాలేదన్నారు. అయినప్పటికీ దేశంలో మాత్రం ఉద్రిక్తతలు తగ్గలేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్లో హింస పెరిగిపోయిందని.. ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని ధ్వజమెత్తార. చట్టాలు సరిగ్గా అమల్లో లేవని.. దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు భారత్-బంగ్లాదేశ్ బంధాన్ని దెబ్బతీస్తున్నాయని వాపోయారు.
ఇది కూడా చదవండి: Asim Munir: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ అనుభూతి పొందాం.. అసిమ్ మునీర్ వ్యాఖ్య
ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల గురించి కూడా షేక్ హసీనా స్పందించారు. ‘‘అవామీ లీగ్ లేకుండా జరిగే ఎన్నికలు ఎన్నికలు కాదు.. పట్టాభిషేకం.’’ అని అన్నారు. యూనుస్.. బంగ్లాదేశ్ ప్రజల నుంచి ఒక్క ఓటు లేకుండా పరిపాలించారని.. కానీ తొమ్మిది సార్లు ప్రజా తీర్పు ద్వారా ఎన్నికైన పార్టీని మాత్రం నిషేధించారని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. స్వతంత్ర న్యాయస్థానం తనను నిర్దోషిగా ప్రకటిస్తుందని తనకు నమ్మకం ఉందని చెప్పారు. బంగ్లాదేశ్లో చట్టబద్ధమైన ప్రభుత్వం, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్నప్పుడు సంతోషంగా బంగ్లాదేశ్కు వెళ్తానని తెలిపారు.
హదీ హత్య
డిసెంబర్ 12న ఢాకాలో రిక్షాలో ఉండగా ఉస్మాన్ హదీని అతి దగ్గరగా కాల్చి చంపారు. తలకు గాయమై మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు విమానంలో తరలించారు. డిసెంబర్ 18న మరణించారు. అనంతరం బంగ్లాలో హింస చెలరేగింది. దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫైసల్ కరీం మసూద్పై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అతడిపై ప్రయాణ నిషేధాన్ని విధిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లోనే ఉన్న మసూద్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తరచూ స్థానాలను మారుస్తున్నాడని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?