Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తానన్న షేక్ హసీనా
- కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోతానని ప్రకటన
- మరణశిక్ష, ప్రాణహాని ఉన్నా వెనక్కి తగ్గనని వ్యాఖ్య
- తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో హింసాత్మక నిరసనల సమయంలో ఆమె భారత్కు పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉంటే, 2026 డిసెంబర్లో తాను బంగ్లాదేశ్కు వెళ్తానని, అక్కడి కోర్టులో లొంగిపోతానని ప్రకటించారు. తనకు మరణశిక్ష విధించినప్పటికీ, తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ, సొంత దేశానికి వెళ్లే నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పారు. రాయిటర్స్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 ఆగస్టులో హింసాత్మక నిరసనల సమయంలో పలువురు మరణాలకు, అణచివేతకు షేక్ హసీనా కారణమని ఆమెకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష విధించింది. అయితే, ఈ ఆరోపణల్ని హసీనా తీవ్రంగా ఖండించారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ పలుమార్లు భారత్ను కోరింది. ఈ తరుణంలో షేక్ హసీనా నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
‘‘నేను తిరిగి వెళ్తే, నన్ను అరెస్ట్ చేయవచ్చు. వారు నన్ను చంపొచ్చు, అయినా నేను వెళ్లాల్సిందే. బంగ్లాదేశ్లో ప్రస్తుతం నా పార్టీ నాయకులు, కార్యకర్తలు భయంకరమైన అఘాయిత్యాలను, అణచివేతను ఎదుర్కొంటున్నారు. నేను చనిపోవాల్సి వస్తే, నా తల్లిదండ్రులను ఖననం చేసిన, వారి రక్తం చిందిన నా సొంత గడ్డపైనే అది జరగాలని కోరుకుంటున్నాను.’’ అని ఆమె అన్నారు. షేక్ హసీనాతో పాటు అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆమె ఆరోపించారు. కోర్టు విచారణ ప్రారంభమైతే నిజం ప్రజలకు తెలుస్తుందని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!